వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ తిరస్కరణ: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మండలం జక్కేరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మహేందర్‌ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతి నిరాకరించడంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహేందర్‌ ఓ పురుగుల మందుల కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

 A youth allegedly committed suicide in gadwal district

రోడ్డు ప్రమాదంలో టీవీ ఛానెల్ రిపోర్టర్ మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొడకండ్ల సమీపంలో రాజీవ్‌ రహదారిపై శుక్రవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా వీ6 ఛానెల్‌ రిపోర్టర్‌ ప్రసన్నకుమార్‌(35) మృతిచెందారు.

తన సోదరుడి పెళ్లి శుభలేఖను బంధువులకు అందించి తిరుగు ప్రయాణంలో కరీంనగర్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ప్రసన్నకుమార్‌ను కుకునూరుపల్లి పోలీసులు గజ్వేల్‌లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A youth allegedly committed suicide in gadwal district due to his love rejected by his girlfriend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X