'సెల్ ఫోన్' చంపేసింది: స్నేహితులే కొట్టి చంపారు, మందు పార్టీ తర్వాత..
హైదరాబాద్: సెల్ ఫోన్ విషయంలో తలెత్తిన ఓ వివాదం ఏకంగా యువకుడి ప్రాణాలే బలిగొన్నది. స్నేహితుడని కూడా చూడకుండా ఇద్దరు యువకులు అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ వెల్లడించారు.

ఆ ముగ్గురు..:
సనత్నగర్లోని తులసీనగర్కు చెందిన రత్నాకర్రాజు(35), బీకేగూడ, సంజయ్గాంధీనగర్లకు చెందిన తీగుల నవీన్కుమార్(36), దాలవాయి పూర్ణ(34).. ఈ ముగ్గురు స్నేహితులు. పూర్ణ కూడా నవీన్కుమార్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు.

సెల్ఫోన్ కొన్నందుకు పార్టీ..:
ఇటీవల నవీన్ కుమార్ కొత్త సెల్ఫోన్ కొనడంతో స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. విషయాన్ని పూర్ణ, రత్నాకర్ రాజులకు చెప్పడంతో మంగళవారం రాత్రి ముగ్గురు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు మద్యం తాగారు. అయితే ఆ సమయంలో నవీన్ కుమార్ కొత్త మొబైల్ కనిపించకపోవడం వివాదానికి కారణమైంది.

రత్నాకర్ రాజే దొంగిలించాడని..:
నవీన్కుమార్ సెల్ఫోన్ కనిపించకపోవడంతో.. పూర్ణ సెల్ఫోన్ నుంచి ఆ నంబర్కు ఫోన్ చేశారు. దీంతో రత్నాకర్రాజు జేబులోనే ఆ సెల్ఫోన్ మోగింది.
తాగిన మత్తులో సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాడో లేక కావాలనే చేశాడో తెలియదు కానీ.. స్నేహితులు మాత్రం అతనిపై దొంగతనం ఆరోపణలు వేశారు. ఆగ్రహావేశంతో నవీన్ కుమార్ అతన్ని తీవ్రంగా కొట్టాడు.

కొట్టి చంపారు..:
నవీన్కుమార్కు తోడు పూర్ణ కూడా తోడవడంతో రత్నాకర్రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వాళ్ల నుంచి తప్పించుకుని రోడ్డు పైకి పరిగెత్తాడు. అయినా వదలని పూర్ణ, నవీన్ కుమార్లు అతన్ని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. దీంతో రత్నాకర్రాజు కిందపడి తలకు తీవ్ర గాయాలవడంతో స్పృహ కోల్పోయాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి అతను మృతి చెందాడు.

నిందితుల అరెస్ట్:
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రత్నాకర్రాజుకు భార్య, కుమారుడు ఉన్నట్టు తెలిపారు. అతన్ని కొట్టి చంపిన నవీన్కుమార్, పూర్ణలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications