వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి: విమర్శల దాడి పెంచిన జగన్

|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు.

గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్నికల ప్రచార సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తీసుకు వచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు.
ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు. లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, అయితే ఇంతవరకూ ఎన్ని రుణాలను మాఫీ చేశారని జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామన్నారని, ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోందని అన్నారు. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోందని చెప్పారు.

YS Jagan lashes out at CM KCR

ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు ఏం కొనేటట్లు లేదని జగన్ అన్నారు.

18 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టించారో కేసీఆర్‌ను అడగండని అన్నారు. దివంగత సిఎం వైయస్ఆర్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని చెప్పని జగన్.. కేసీఆర్ ఇప్పటివరకూ 394 ఇళ్లు మాత్రమే కట్టించారన్నారు. ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్న కెసిఆర్.. ఇప్పటివరకూ ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.

కేసీఆర్ కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతలు దులపుకున్నారని మండిపడ్డారు. ఈ పాలకులకు బుద్ధి రావాలంటే రాజన్న రాజ్యం రావాలని అన్నారు. కాంగ్రెస్ అంత అన్యాయమైన పార్టీ ఎక్కడా ఉండదని విమర్శించారు. చంద్రబాబు పాలన అంటే అంతా అబద్ధాలు, మోసం, వెన్నుపోటేనని చెప్పారు.

అధికారంలోకి వచ్చి 18 నెలులు అయినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. తమ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Thursday lashed out at Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X