Tirumala: తిరుమలలో మరోసారి చిరుతల సంచారం..
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం సృష్టించాయి. సోమవారం అలిపిరి నడకదారిలో ఆఖరు మెట్టు దగ్గర రెండు చిరుతలు కనిపించాయి. దీంతో భక్తులు వెంటనే గట్టిగా కేకలు వేశారు. భయపడిన చిరుతలు పారిపోయాయి. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
భక్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు టీటీడీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి నడకదారిలో పంపుతున్నారు. చిరుతలను పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. గతంలో కూడా చిరుతలు నడక మార్గంలో కనిపించాయి. కొద్ది నెలల క్రితం చిన్నారి దాడి చేసి చంపాయి. దీంతో తిరుమల మెట్ల మార్గంలో భక్తులు భయపడుతూ పైకి వెళ్లారు. టీటీడీ భక్తులకు కర్రలు కూడా ఇచ్చింది.

మరోవైపు అటవీ సిబ్బంది నాలుగైదు చిరుతలను బంధించి అడవిలో వదిలి పెట్టారు. అయితే తాజాగా చిరుతలు మరోసారి కనిపించడం భక్తులు ఆందోళన చెందుతున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications