తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయం: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే వెల్లడి: కేబినెట్‌లో తీర్మానం

|
Google Oneindia TeluguNews

తిరుపతి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భార్య సాధనా సింగ్ చౌహాన్‌తో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు.

ఖుష్బూ కారును ఢీ కొట్టిన ట్యాంకర్: నుజ్జునుజ్జు: నటి సేఫ్ఖుష్బూ కారును ఢీ కొట్టిన ట్యాంకర్: నుజ్జునుజ్జు: నటి సేఫ్

అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. బేడీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తదితరులు చౌహాన్ దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకుని అతిథిగృహానికి చేరుకున్నారు.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan visits Tirumala and announced Cow Cabinet

ఆ కొద్ది సేపటికే శివరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో గోవుల సంక్షేమానికి కొత్తగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కీలక శాఖలకు భాగస్వామ్యాన్ని కల్పించారు. పశు సంవర్ధకం, అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, హోమ్, రైతాంగ సంక్షేమ శాఖలను ఇందులో ఈ కౌ కేబినెట్‌లో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 22వ తేదీన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నానని, గోవుల సంక్షేమ శాఖపై ఇందులో తీర్మానం చేస్తామని అన్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అగర్ మల్వా గోవుల అభయారణ్యంలో గల గోపష్టమిలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు.

Recommended Video

Sonu Sood Help to AP Farmer With Tractor

ఫలితంగా- కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవలే నిర్వహించిన 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆయన ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ సభ్యుల సంఖ్య చేకూరింది. దీనితో తొలిసారిగా ఆయన చాలాకాలం తరువాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

English summary
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan and his wife Sadhna Singh Chouhan offer prayers to Lord Balaji in Tirumala in Chittoor district of Andhra Pradesh. After he has decided to form a 'Cow Cabinet' for the protection of cows in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X