తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం...
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి నిత్యం భక్తులు వెళ్తుంటారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం ఉంటుంది. తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఏకంగా రూ.5.04 కోట్ల ఆదాయం వచ్చిందంటే ఇక్కడ భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థం అవుతుంది.
జనవరిలో ఇదే టాప్ రికార్డ్ స్థాయి ఆదాయమని అధికారులు తెలిపారు. ఇక, గతనెల అంటే డిసెంబర్ 2023లో కూడా శ్రీవారి ఆదాయం రూ.5 కోట్ల మార్క్ను అందుకుంది. తొలిసారి జనవరి నెలలో ఆ రికార్డును చేరుకుంది. శుక్రవారం నుంచి వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వరుస సెలువుల కారణంగా కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.

ఇదిలా ఉండగా, ఒక్క ఆదివారం మాత్రమే తిరుమల వెంకటేశ్వరస్వామివారిని మొత్తం 85,142మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజు స్వామి వారికి ఆదాయం రూ.5.04 కోట్లు వచ్చింది. ఇందులో 22,064మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మొత్తం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఇక, సర్వదర్శనం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం కోసం పన్నెండు గంటల సమయం పడుతోంది.
శుక్రవారం నుంచి వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఇక, తిరుమల స్వామివారి సర్వదర్శనానికి దాదాపు పది గంటలకుపైగా సమయం పట్టిందని ఇక్కడివారు చెబుతున్నారు. వచ్చెనెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాల గురించి ఓసారి చూద్దాం..
వచ్చే నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల కార్యక్రమాలు...
ఫిబ్రవరి 9న శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవం కార్యక్రమంగా జరగనుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న తిరుకచ్చినంబి ఉత్సవారంభం. ఫిబ్రవరి 14న వసంతపంచమి కార్యక్రమం. ఫిబ్రవరి 16న రథసప్తమిని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న తిరుకచ్చినంబి శాత్తుమొర కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయనున్నారు. ఫిబ్రవరి 21న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications