జగన్పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం
ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నిక వేడిని మరింత పెంచుతూ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభ తొలిసారి నగరంలోకి అడుగుపెట్టారు. తిరుపతి అంతర్జాతీయ విమాశ్రయం వద్ద బీజేపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. నగరంలోకి అడుగు పెడుతూనే చేతిలో కమలం పువ్వు, మెడలో కాషాయ కండువాతో రత్నప్రభ ప్రచారంలోకి దిగిపోయారు.

తిరుపతిలో తొలిసారి..
బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన రత్నప్రభ.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తిరుపతి బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు, టీడీపీ ప్రచార శైలిపైనా కీలక కామెంట్లు చేశారు. అదే సమయంలో తిరుపతి ఓటర్లకూ ఓ కఠిన సవాలు విసిరారు. రత్నప్రభ ఏమన్నారో ఆమె మాటల్లోనే..

జన్మభూమికి సేవ చేయాలనే..
''కర్ణాటక నా కర్మభూమి అయితే.. ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి. సొంత రాష్ట్రంలో పనిచేయాలన్న నా కోరిక ఇన్నేళ్లకు నిరవేరింది. మాతృభూమి కోసం పనిచేయడంలోనే అమితమైన ఆనందం ఉంటుంది. ఆంధ్రాపై అభిమానంతోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. తిరుపతి కోసమే కాకుండా యావత్ ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాను. తిరుపతి నుంచి గెలిస్తే..

తేల్చుకోవాల్సింది ప్రజలే..
ఏపీ నుంచి వైసీపీ తరఫున పార్లమెంటుకు 22 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరు కూడా కనీసం సొంత నియోజకవర్గాల సమస్యలపైనా సభలో మాట్లాడలేదు. తిరుపతి నుంచి నేను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్ లో ఇక్కడి సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడతా. మన గొంతు పార్లమెంట్ వరకూ వినిపిస్తా. సోమవారమే నెల్లూరులోని ఆర్వో కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలకు నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. ప్రజలు ఆలోచన తీరు మారాలి. నీతి నిజాయితీలకు ఓటు వేయాలా.. లేక డబ్బులకు ఓటు వేటేయాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి. వ్యక్తిగతంగా నాపై..

జగన్ను అభినందిస్తే తప్పేంటి?
గతంలో సీఎం జగన్ను ప్రశంసిస్తూ నేనొక ట్వీట్ చేస్తే దాన్ని సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. జగన్ మంచిపని చేస్తే ప్రశంసించాను. అందులో తప్పులేదు. కానీ అభినందించినత మాత్రాన నేను వైసీపీకి మద్దతు ఇచ్చినట్లు కానేకాదు. నా ట్వీట్ ను అటు వైసీపీ వాళ్లు, ఇటు టీడీపీ వాళ్లు వైరల్ చేస్తున్నారు. వైసీపీ వారేమో తమకు మద్దతు పలికిన వ్యక్తిగా, టీడీపీ వాళ్ళు జగన్ మనిషి అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ సీఎం గా గెలిచినప్పుడు నేను అభినందిస్తూ ట్వీట్ చేసిన మాట వాస్తవం. కానీ ఈ రకమైన తప్పుడు ప్రచారాలు తగవు. ఇకపోతే..

తిరుపతి ప్రచారానికి పవన్ కల్యాణ్
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. తిరుపతిలో బీజేపీకి జనసేన మద్దతు లేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ముమ్మాటికీ అవాస్తవం. నా అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ 200 శాతం సంతృప్తిగా ఉన్నారు. తిరుపతిలో ప్రచారానికి రావాల్సిందిగా పవన్ ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని హామీ కూడా ఇచ్చారు. తిరుపతిలో గెలిచి, స్థానికుల గొంతును పార్లమెంటులో వినిపించడంతోపాటు ఏపీ ప్రజలందరి తరఫునా పోరాడుతా'' అని రత్నప్రభ అన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications