తిరుమలలో ఇది పరిస్థితి, దర్శనానికి రెండు రోజులు, ఆలోచించుకుని కొండ మీదకు రండి !
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలకు విపరీతంగా భక్తులు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి టోకన్లు లేని భక్తులు వేల సంఖ్యలో తిరుమలలో అడుగుపెట్టడంతో తిరుమల కిటకిటలాడుతోంది. టోకన్లు లేని భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వెయ్యలేకపోయారు.
TTD: తిరుమలలో గదులు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !
శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో ఏవీ, ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోందని చెప్పారు. అయితే పరిస్థితి తారుమారైయ్యింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీవారి భక్తులు లక్షలాది మంది తిరుమలకు చేరుకున్నారు. ఇంత మంది శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుంటారు అని టీటీడీ అధికారులు ఊహించలేకపోయారు.
శుక్రవారం రాత్రి టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దర్శనం టోకన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 48 గంటల సమయం పడుతోందని తెలిపారు. వేసవితో పాటు వారంతపు సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు పోటెత్తారని టీటీడీ అధికారులు అంటున్నారు.
వైఎస్ జగన్ ను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎంగారు మీరు కచ్చితంగా రావాలి !!
ప్రస్తుతం తిరుమలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల కొండ మీద ఉన్న శ్రీవారి భక్తులకు, క్యూ లైన్లలోని భక్తులకు, తిరులమలోని పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, మంచినీరు అందించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.