అమరావతిలో భూముల కొనుగోలుపై వివరణ ఇచ్చిన హెరిటేజ్...
రాజధానిలో భూముల కొనుగోలుపై ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే...ముఖ్యంగా టీడీపీ నేతలతో పాటు హెరిటేజ్ గ్రూపు రాజధానిలో భూములు కొనుగోలు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు సార్లు ప్రకటించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడ హెరిటేజ్ 14 ఎకరాల భూమిని రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో కొనుగోలు చేసిందని ఆయన ప్రకటించారు. మొత్తం 4 వేల ఎకరాల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు.
దీంతో హెరిటేజ్ సంస్థల మంత్రి బుగ్గన చేసిన ఆరోపణలపై స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. వ్యాపార విస్తరణలో భాగంగానే భూములు కొనుగోలు చేశామని చెప్పారు. ఇందుకోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఈ నేపథ్యంలోనే 2014 మార్చిలోనే సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అనంతరం మూడు నెలలకు అనగా 2014 జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని చెప్పారు. ఇక మొత్తం మూడు దశల్లో మొత్తం 9.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. కాగా రాజధాని నిర్మాణ ప్రాంతం అమరావతికి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన స్థలం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వైసీప చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తమ ప్రకటనలో తెలిపారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications