వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: జగన్ భయపెడితే బీజేపీ అండగా ఉంటుందంటూ: గంటా సైతం టచ్ లో ..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తరువాత వైసీపీలో ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ అధినేతకు పంపిన లేఖలో పదవులు.పార్టీతో పాటుగా రాజకీయాలకు దూరమవుతున్నాట్లుగా పేర్కొన్నాు. అసలు..ఆయన ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయంగా మొదలైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో సంప్రదింపుల కోసం పార్టీ సీనియర్లకుబాధ్యతలు అప్పగించారు. వారితో వంశీ ఇంకా చర్చలకు ముందుకు రాలేదు. ఇదిలా ఉండగానే..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేత కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీకి అభమయమిచ్చారుజ సీఎం జగన్..వైసీపీ నేతలు బెదింపులకు భయడాల్సిన అవసరం లేదని చెబుతూనే వంశీతో సహా మాజీ మంత్రి గంటా సైతం తమతో టచ్ లో ఉన్నారంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

వంశీకి బీజేపీ అండగా ఉంటుంది..
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ బెదిరింపులకు బెదరాల్సిన పనిలేదని.. తమతో చేతులు కలిపితే అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త రఘురాం కీలక వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా వంశీతో సహా గంటాకు హామీ ఇచ్చారు. వంశీ బీజేపీ..వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపాకే రాజీనామా చేశారని రఘురాం చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేస్తూ, రాజకీయంగా మచ్చలేని నాయకులు ఎవరొస్తామన్నా.. వారిని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఎమ్మెల్యే వంశీ వైసీపీ బెదిరింపుల వల్లే పదవికి రాజీనామా చేయబోతున్నారన్నదే నిజమైతే వారి బెదిరింపులకు ఆయన భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఆయన బీజేపీలోకి వస్తే ఆయనకు అన్నివిధాలా అండగా ఉంటామని పదే పదే ప్రస్తావించారు. వంశీతో సహా..మరి కొందరు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

వంశీ..గంటా బీజేపీతో టచ్ లో ఉన్నారు..
వల్లభనేని వంశీతో పాటుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం తమతో టచ్ లో ఉన్నారని రఘురాం చెప్పారు. వారిద్దరూ బీజేపీలో చేరటానికే ఎక్కవ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసారు. జగన్ సీఎం అయ్యాక వైసీపీలోకి కొత్తగా ఎవర్నీ చేర్చుకోనని, ప్రజలు తనను అఖండ మెజారీతో గెలిపించినందువల్ల కొత్తవారిని చేర్చుకోవలసిన అవసరం తనకు లేదని అసెంబ్లీలోనే ప్రకటించారని.. ఇప్పుడు మాట తప్పి టీడీపీ వారిని భయపెట్టి మరీ వైసీపీలోకి చేర్చుకోవాలనుకోవడమేమిటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ నేతల వల్ల టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఉందని, భయపెట్టి ఎంతమందిని పార్టీలోకి లాక్కుంటారని ప్రశ్నించారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వంశీకి మద్దతుగా వ్యాఖ్యాలు చేసారు. ఆయనకు మద్దతుగా పోరాటం చేస్తామని క్రిష్ణా జిల్లా పార్టీ సమావేశంలో ప్రకటించారు.

కొనసాగుతన్న సస్పెన్స్..
టీడీపీ అధినేత చంద్రబాబుకు రెండు సార్లు లేఖలు రాసిన వంశీ తో చర్చల కోసం టీడీపీ అధినేత పార్టీ సీనియర్లను రంగంలోకి దింపారు. అయితే, వంశీ వారిలో ఒకరైన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో ఫోన్ లో మాట్లాడారు. వంశీ ప్రస్తుతం హైదరాబాద్ లో వైద్య పరీక్షల కోసం ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీలో ఉండలేని పరిస్థితి ఉందని చెప్పటం..ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువాత టీడీపీకీ రాజీనామా చేయటం ..చంద్రబాబకు రాసిన లేఖలో వైసీపీ వేధింపులను ప్రస్తావించటం..ఇక, ఇప్పుడు బీజేపీ నేతలే స్వయంగా తమతో వంశీతో సహా గంటా సైతం టచ్ లో ఉన్నారని చెప్పటం ద్వారా ఏపీలో తెర వెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరి గురించి బీజేపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసినా..వారు మాత్రం వీటిపైన స్పందించలేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications