Vijayawada: లోకల్ హీట్: గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టడానికి దేవినేనిని దించిన వైసీపీ..!
విజయవాడ: విజయవాడ రాజకీయాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. విజయవాడలో బలమైన నాయకుడిగా ఎదిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టే దిశగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి, పార్టీలో చేరిన యువ నాయకుడు దేవినేని అవినాష్ ను ఆయనకు పోటీగా దింపింది. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సమయంలో ఆధిపత్య పోరాటానికి తెర తీసినట్టయింది.

బైక్ ర్యాలీతో హల్ చల్
విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బాధ్యతలను స్వీకరించిన దేవినేని అవినాష్ తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. విజయవాడలో భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రి దీనికి హాజరయ్యారు. విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దేవినేని నెహ్రూ కుటుంబంతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

మంత్రులు హాజరు..
గుణదలలోని దేవినేని నెహ్రూ నివాసం వద్ద ఆరంభమైన ఈ బైక్ ర్యాలీ.. ఈఎస్ఐ రోడ్డు, క్రీస్తురాజపురం, సున్నంబట్టీల సెంటర్, డీవీ మ్యానర్ రోడ్ మీదుగా సాగింది. ర్యాలీ ముగిసిన అనంతరం శేషసాయి కల్యాణమండపంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, బొప్పన భవకుమార్ హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా..
త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు చెబుతున్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో విజయవాడ అర్బన్ మండలం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32, 36, 41, 45, 48లతో పాటు 50 నుంచి 74 వరకు వార్డులు ఉన్నారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉన్నాయి. ఈ సారి వైసీపీ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో దేవినేనికి ఆ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ ఇదివరకు తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం కలిసి వచ్చే అంశమని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కార్పొరేషన్ పై వైసీపీ జెండా ఎగరాలంటూ..
విజయవాడ కార్పొరేషన్, తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు, దేవినేని కుటుంబ సభ్యులు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, దేవినేని నెహ్రూ మధ్య స్నేహ సంబంధాలు ఉండేవని, 2014 ఎన్నికలకు ముందు నెహ్రూను వైసీపీలోకి రావాలని ఆహ్వానించామని, అయితే ఎందుకో ఆయన తప్పటడుగు వేశారన్నారు. అవినాష్ వైసీపీలో చేరటం వల్ల దింగత నేత నెహ్రూ ఆత్మ శాంతిస్తుందని అన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications