అచ్చెన్నపై కేసా.. హవ్వా.. హవ్వా... మరీ జగన్ సంగతేంటీ: చంద్రబాబు విసుర్లు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఛీప్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడుపై కేసు పెట్టారని గుర్తుచేశారు. కావాలనే వేధించడం సరికాదు అని.. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అచ్చెన్నాయుడిపై కేసు పెడితే జగన్ చేసిన అన్యాయానికి, అవినీతికి జీవితాంతం జైల్లో ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్కు బయట ఉండే అర్హత లేదన్నారు. విశాఖ మేయర్గా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై కూడా కేసు పెట్టారని తెలిపారు. ఇది అరాచకానికి పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

విశాఖకు ఒక శని పట్టిందని పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆ శనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని చంద్రబాబు అన్నారు. రాజధానుల పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఇక సమయం కోసం వేచి చూడటమే మిగిలిపోయిందని చెప్పారు.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications