వైజాగ్ స్టీల్ కోసం మలిదశ పోరు-రేపటి ఏపీ వ్యాప్త నిరసనలకు భారీ మద్దతు..!
ఏపీలో ప్రభుత్వ రంగ సంస్ధగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు మలిదశ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా రేపు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. వీటిలో పాల్గొనాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు పిలుపునిచ్చాయి. దీంతో ఇప్పటికే రాష్ట్ర లారీ యజమానుల సంఘంతో పాటు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రాస్తారోకోలకు సీపీఎం మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని పార్టీలు, సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై ఉమ్మడి పోరు సాగించాలని పిలుపునిచ్చింది. బీజేపీ ప్రభుత్వ మెడలు వంచాలని సీపీఎం నేతలు సూచించారు. విశాఖ ఉక్కును రక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాలన్నారు. ఇవాళ విజయవాడ గవర్నర్ పేటలో సిపిఎం, సిఐటియు నేతలు విశాఖ ఉక్కు పరిరక్షణకై మూడో తేదీన జరిగే రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటవేదిక చైర్మన్ సీహెచ్.నర్సింగరావు రూపొందించిన పత్రాల్ని నేతలు విజయవాడలో పంపిణీ చేశారు. 32 మంది తెలుగు ప్రజల ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును దక్షిణ కొరియాకు చెందిన పోస్కో, ఆదాని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తెగనమ్మటానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మి మోడీ దేశద్రోహానికి పాల్పడుతున్నారన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణకై రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నుండి 11 గంటల మధ్య జరిగే రాస్తారోకోలు జయప్రదం చేయాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో 9.30 గంటలకు కృష్ణలంక రాణి గారి తోట వద్ద హైవేపై జరిగే రాస్తారోకోలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఇప్పటికే సీపీఎం, సీపీఐ సహా అన్ని కార్మిక, ప్రజా సంఘాలు భాగస్వాములవుతుండగా.. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని నేతలు కోరారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications