కేసీఆర్ కు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు.. శారదపీఠంలో పూర్ణకుంభంతో స్వాగతం
విశాఖ : తెలంగాణ సీఎం కేసీఆర్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబసభ్యులతో చినముషిడి వాడలోని శారదా పీఠానికి వెళ్లిన కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అక్కడి ప్రతినిధులు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అక్కడి ఆవరణలోని విజయ హనుమాన్ విగ్రహానికి, అలాగే శమీ చెట్టుకు పూజలు చేశారు. మధ్యాహ్న భోజనం ఆశ్రమంలోనే చేశారు.
అక్కడి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రత్యేక విమానంలో ఒడిశాకు బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్ లో సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీకానున్నారు. ఆదివారం రాత్రి నవీన్ పట్నాయక్ ఆతిథ్యం స్వీకరించి ఆయన ఇంట్లోనే బస చేయనున్నారు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది. కేసీఆర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొందరు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు అభివాదం చేశారు. కొన్నిచోట్ల కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications