డాక్టర్ సుధాకర్ మృతి.. గతేడాది ఏపీ సర్కార్పై పోరాటం, చంద్రబాబు దిగ్బ్రాంతి
గతేడాది కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్పై నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీంతో అతనిని సస్పెండ్ కూడా చేశారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు లేవని నానా హంగామా చేశారు. కోర్టు, కేసుల వరకు ఇష్యూ నడిచింది. ఒకానొక సందర్భంలో గుండు కూడా తీసుకున్నాడు.

సుధాకర్ మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారని ఆరోపించారు. సుధాకర్ మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది కరోనా సమయంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సుధాకర్ను రాష్ట్ర సర్కార్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
Recommended Video
దీనికి సంబంధించి హైకోర్టులో కేసు నడిచింది. కోర్టు కూడా సీబీఐతో విచారణ జరిపించి ఆయనకు సంబంధించిన ఫిర్యాదులపై నివేదిక సమీకరించింది. ఇంతలో ఆయన చనిపోవడం కలచివేసింది. కానీ చంద్రబాబు మాత్రం ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు. సుధాకర్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications