వైజాగ్లో సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించేందుకు సీఎం జగన్ స్టీల్ సిటీకి వచ్చారు. ఈ క్రమంలో జగన్కు దారిపొడవునా ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
మధ్యాహ్నాం విజయవాడ నుంచి వైజాగ్ బయల్దేరారు సీఎం జగన్. వైజాగ్ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వద్దకు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్మించారు. దారి పొడవునా ప్రజలకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కాన్వాయ్పై పూలవర్షం కూడా కురిపించారు. బెలూన్లను గాలిలోకి విసిరి తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ముసలి, ముతకలు కూడా జగన్ కోసం నిరీక్షించడం విశేషం. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్ను వెల్ కం చెప్పారు.

దారిలో సీఎం జగన్కు మానవహరంతో ధన్యవాదాలు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించే నేపథ్యంలో 394.50 కోట్లను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోస్టన్ కమిటీ నివేదిక రాగానే హై వపర్ కమిటీని నియమిస్తారు. హై పవర్ కమిటీ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. రాజధాని మార్పు ప్రక్రియను జగన్ ప్రభుత్వం పూర్తిచేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications