జోరుగా సాగుతున్న గంజాయి దందా.. వరంగల్ జిల్లాలో కోటిరూపాయల విలువైన గంజాయి సీజ్
ప్రభుత్వాలు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణాను పట్టుకోకుండా ఉండేందుకు ఎవరికీ దొరక్కుండా రకరకాల మార్గాలలో గంజాయి దందా సాగిస్తున్నారు. రైళ్లు, బస్సులలో రవాణా చేయడం, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే లారీలలో పంపే ప్రయత్నం చేయడం, ఇక వాహనాలలో ప్రత్యేకమైన సీక్రెట్ లాకర్లను ఏర్పాటు చేయడం వంటి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. పక్కా సమాచారం ఉంటే తప్ప ఒక్కోసారి గంజాయి అక్రమ రవాణాను పట్టుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది.

ఆగని గంజాయి అక్రమ దందా
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకోవడం కోసం తెలంగాణా రాష్ట్రం ప్రత్యేకంగా దృష్టి సారించి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గంజాయి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న ఘటనలే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బుధ రావు పేట శివారులో డిసిఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల యాభై కిలోల ఎండు గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. బలిమెల నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా ఈ గంజాయిని పట్టుకున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా విశాఖ నుండి ఢిల్లీకి వరంగల్ మీదుగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
మరో నలుగురు పరారీలో ఉన్నట్లు గా తెలుస్తుంది. ఇక పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో ఈ గంజాయిని ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఈ గంజాయి దందా వెనుక వున్న వారెవరు వంటి అనేక విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరుసగా వరంగల్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా అవుతున్న కేసులు కూడా ఇటీవల కాలంలో బాగా నమోదయ్యాయి. తాజాగా విశాఖ నుండి ఢిల్లీకి వరంగల్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications