శోభాయామానంగా కాళేశ్వరం.. 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర
వరంగల్ : ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు కనులపండువగా సాగే ఉత్సవాలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 గంటలకు దీపారాధన, గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనం నిర్వహించనున్నారు. 11 గంటలకు మండప దేవతారాధనముతో పాటు సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం, రాత్రి 8 గంటలకు ఊరేగింపు, ఎదుర్కోలు సేవలు జరపనున్నారు.
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కాళేశ్వరం శైవక్షేత్రం కొత్త శోభ సంతరించుకుంది. శివ పార్వతుల కల్యాణ మహోత్సవం తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు వస్తారనేది ఓ అంచనా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శివరాత్రి ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications