మినీ మేడారంలో కరోనా.. 10 లక్షల మంది వరకు హాజరు, సిబ్బందికి పాజిటివ్..?
మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేపింది. దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకిందని తెలుస్తోంది. దీంతో భక్తులు ఆదోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ వ్యాపించిందని అంటున్నారు. సిబ్బందికి వైరస్ సోకిందా లేదా అనే అంశాన్ని మేడారం దేవాలయ ఉన్నతాధికారులు మాత్రం ధృవీకరించడం లేదు.
కరోనా కేసులు నమోదవడంతో ఆలయ సిబ్బంది, భక్తుల్లో భయం నెలకొంది. టెస్టులు చేసిన తర్వాత ఆలయ అధికారులు ధృవీకరించే అవకాశం ఉంది. మేడారం మినీ జాతర ఈ నెల 24వ తేదీన ప్రారంభమై.. నేడు ముగియనుంది.పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇక్కడకు వచ్చే వారు కనీస ముందు జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత జాతరను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రణాళిక లోపం వల్ల సిబ్బందికి కరోనా వైరస్ వచ్చి ఉంటుందని అంటున్నారు. బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ గట్టమ్మ వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు.
మేడారంలో సమ్మక్క సారలమ్మలకు చీరె పెట్టి పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ జాగ్రత్తలు పాటించి, అమ్మవార్ల దర్శనాలు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఆలయ సిబ్బందికి వైరస్ వచ్చిందనే ప్రచారం మాత్రం భక్తులను భయాందోళన కలిగిస్తోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications