Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోరంచపల్లిలో బాధితులను చూసి చలించిన కిషన్ రెడ్డి: ఆ 900 కోట్లు విడుదల చేయాలి

వరంగల్: వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లితోపాటు ఇతర గ్రామాల్లోని బాధిత ప్రజలను పరామర్శించిన కిషన్ రెడ్డి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ క్రమంలో ముందుగా పోతననగర్ వరద బాధితులను పరామర్శించి.. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద ఉధృతికి దెబ్బతిన్న బ్రిడ్జి, రహదారులను పరిశీలించారు. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర బృందాలు రేపట్నుంచి వరద నష్టం వివరాలు సేకరిస్తాయని తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సాయం చేయాలన్నారు.

Union minister Kishan Reddy visited flood affected areas in joint warangal district

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ. 900 కోట్ల విపత్తు నిధులను వాడాలని కిషన్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందజేస్తామని.. ఇందులో కేంద్రం రూ. 3 లక్షలు, రాష్ట్రం రూ. లక్ష ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పర్యటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

'ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమైన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించాను. వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు సర్వస్వం పోగొట్టుకున్న గ్రామస్తులను చూసి చలించిపోయాను. వరదల్లో గల్లంతైన వారి కుటుంబాలని పరామర్శించి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చాను' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

'గల్లంతైన మృతదేహాల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించాను. పలువురు బాధిత కుటుంబాలను ఈ సందర్భంగా పరామర్శించాను. ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను. ఇక్కడ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు.. ఒక ఫోన్ కాల్‌తోనే స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షాకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Union minister Kishan Reddy visited flood affected areas in joint warangal district

కాగా, వర్షాలు, వరద ఉద్ధృతి తగ్గినా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద తగ్గినా సహాయ సహకారాలు అందక.. మరికొన్ని చోట్ల బురదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తా చెదారం కొట్టుకొచ్చి.. వీధులన్నీ అపరిశుభ్రంగా మారాయి. ఇళ్లల్లోకి కూడా బురద చేరింది. ఇంట్లోని వస్తువులు, నిత్యావసరలు పనికి రాకుండా పోయాయని బాధిత ప్రజలు వాపోతున్నారు. మరోవైపు, అధికారులు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+