రాజు మారినప్పుడల్లా రాజధాని మారదన్న రఘురామ.. పవన్ కళ్యాణ్ దీక్ష శుభ పరిణామం అంటూ ..
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టులో పేర్కొన్న అంశాలపై మాట్లాడారు. రాజధాని మార్పు విషయంలో ఆయన తనదైన శైలిలో స్పందించారు .అంతేకాదు అంతర్వేది ఘటనపై స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేపట్టడం శుభపరిణామం అని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణకు తాను సైతం శుక్రవారం రోజున 8 గంటల దీక్ష చేపడతానని పేర్కొన్నారు.

అంతర్వేది ఘటన కుట్ర అంటూ అనుమానం
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వస్తుంది అన్నారు రఘురామకృష్ణంరాజు. దీన్ని మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన చర్యగా వదిలేయకుండా డీజీపీతో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ తక్షణమే ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది చెప్పిందని, రాజధానిపై రాష్ట్రాల తుది నిర్ణయమని, రాష్ట్రం ఎప్పుడో ఆ నిర్ణయం తీసుకుందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

రాజధాని మార్చటం కుదరదు
శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులో విశాఖపట్నం పేరు లేదని పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు . రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చడం కుదరదు అని చెప్పిన రామకృష్ణంరాజు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు.
రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.

హైకోర్టును రాయలసీమకు తరలించటం మిధ్యే
ఎక్కడైనా రాష్ట్రప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం దానికి కావలసిన ఆర్థిక సహకారం అందిస్తుందని పేర్కొన్న రఘురామ రాజధాని అమరావతిలోనే ఉంటుందంటూ తేల్చి చెప్పారు. హైకోర్టు కర్నూలు కు మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టును రాయలసీమకు తరలించటం మిధ్యే అని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. రాజధాని ఎక్కడికీ పోదని , అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రఘురామ వ్యాఖ్యానించారు .
Recommended Video

కేంద్రం అఫిడవిట్ లో చెప్పిందే జరిగింది .. కన్ఫ్యూజ్ కాకండి
విజిలెన్స్ విచారణ పేరుతో రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పేమెంట్స్ ఇవ్వకుండా ఆపడం దురదృష్టకరమని రఘురామకృష్ణంరాజు విచారం వ్యక్తం చేశారు. కేంద్రం నుండి డబ్బులు విడుదలైనా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి వచ్చినా రైతులకు చేరడం లేదని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకోమని అఫిడవిట్ లో చెప్పిన విధంగా జరిగిపోయిందని ,అది అమరావతినే రాజధానిగా నిర్ణయించిందని రఘురామ లాజిక్ చెప్పారు .
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications