తెలంగాణ కోసం నల్గొండ ఎన్నారైల పిలుపు
ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా నిర్ణయం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రులు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి అఖిలపక్ష జెఎసి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేసారు. తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందర్నీ అభినందించారు. సాధారణంగా అధికారం కోసం ఎవరితీరు వారిదే అన్నట్లు ఉండే నేతలు తెలంగాణ ఉద్యమంలో ఒక్కతాటిపై నడవడం పట్ల ఎన్నారైలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. అదేవిధంగా రాజకీయ నేతలు, విద్యార్దులు, ఇతర ఉద్యమకారులు సంఘటితమై ఆంధ్ర ప్రాంత నేతల ధన ప్రాభల్య రాజకీయాలను అడ్డుకోవాలని వారు సూచించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు సమైక్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతూ న్యాయమైన తెలంగాణ సాధనకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎన్నారై ప్రముఖులు ఆకాంక్ష వ్యక్తం చేసారు.