ఎన్నారై వోటింగ్ రైట్స్ బిల్లుపై చర్చ

ఎన్నారై వోటింగ్ హక్కు బిల్లును ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభ ఆమోదించింది. శీతాకాలం సమావేశాల్లో ఈ బిల్లు లోకసభ రానుంది. దాదాపు 25 మిలియన్ల భారతీయులు విదేశాల్లో ఉన్నారు. వారంతా వ్యక్తిగతం పోలింగ్ రోజు భారతదేశంలోని తమ తమ నియోజకవర్గాల్లో ఉండడం సాధ్యం కాదని ఎన్నారైలు వాదిస్తున్నారు. అమెరికానే తీసుకుంటే, మొత్తం పది లక్షల మంది ఎన్నారై ఓటర్లుంటారని అంటున్నారు. విద్యార్థులు 2 లక్షల మంది, అమెరికాలో హెచ్1 - బి హోల్డర్లు 3 నుంచి 5 లక్షల మంది, గ్రీన్ కార్డు హోల్డర్లు ఐదు లక్షల మంది ఉంటారని ఓ అంచనా. వీరందరూ పోలింగ్ రోజు భారత్ రావాలంటే వంద రోజులు పడుతుందని అంటున్నారు. అది ఆచరణ సాధ్యం కాని విషయమని వాదిస్తున్నారు. పది లక్షల మంది ఒకేసారి రావాలంటే సాధ్యపడదు కాబట్టి 99 రోజుల ముందు నుంచి వరుస బెట్టి రావాల్సి ఉంటుందని, దీని వల్ల ఎన్నారైల డబ్బు, సమయం వృధా అవుతుందని అంటున్నారు. అందువల్ల ప్రస్తుత బిల్లుకు సవరణ కావాలనేది ఎన్నారైల డిమాండ్. ఈ నెల 31వ తేదీన చర్చలో పాల్గొనదలచినవారు [email protected], http://www.nrivotingrights.info సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications