ఆస్ట్రేలియాలో తగ్గిన భారత విద్యార్థులు

గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకూ భారతీయులపై దాడి జరిగిన ఘటనలు వంద వరకూ నమోదయ్యాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ కు ఎన్ని హామీలు ఇచ్చినా, దాడులపై ఎన్ని చర్యలు తీసుకున్నామని చెప్పినా దాడులు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో అక్కడ దాడులు జరగడం పరిపాటిగా మారింది. దీంతో తమ పిల్లలను ఆస్ట్రేలియాకు పంపడానికి భారతదేశంలోని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒకప్పుడు అత్యంత ప్రశాంతమైన దేశంగా ఉన్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా దాడులకు కేంద్రంగా మారిపోవడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications