వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమ్ ఆద్మీ పార్టీ క్రికెట్‌గిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: తమ పార్టీ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ యుకె మద్దతుదారులు గత కొంతకాలంగా ప్రచారం సాగిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ట్రోఫీ సందర్భంగా వారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ చొక్కాలు ధరించి వెస్టిండీస్‌తో భారత్ జట్టు లండన్‌లో ఓవల్ మైదానంలో ఆడిన మ్యాచుకు రాజ్ రెడ్జీ - గిల్, కపిల్ భట్, జైనాథ్ మిశ్రా తదితరులు వెళ్లారు.

అలాగే బర్మింగ్‌హామ్‌లో ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచుకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు అలాగే వెళ్లారు. ఆమ్ ఆద్మీ టోపీలు, టీ - షర్టులు ధరించి తిరంగా జెండాలను చేబూని చంద్రశేఖర్ బికుమండ్ల తదితరులు ఆ మ్యాచుకు వెళ్లారు.

 AAP UK launches Cricketgiri

నినాదాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు భారతీయులతో కలిసిపోయారు. వారితో మాట్లాడారు. చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించారు. అంతేకాకుండా కన్నడిగరు యుకె ఏర్పాటు చేసిన క్రీడా మేళాలో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ఆమ్ ఆద్మీ యుకె మద్దతుదారులు 11 మంది వెళ్లారు.

ఆమ్ ఆద్మీ పార్టీ టీ - షర్టులు ధరించి మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా జైనాథ్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రసంగం చేశారు. ఈ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ క్రికెట్‌గిరి చేశారు. తాము సిక్సర్లు కొట్టామని ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ రాజ్ ఓ ప్రకటనలో అన్నారు.

English summary
Aam Aadmi Party UK launched Cricket’giri and hit a sixer with the cricket loving Indian diaspora in the UK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X