పేద విద్యార్థికి ఎన్నారైల సహాయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం ఓ పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసింది. ఎం సురేశ్ అనే విద్యార్థికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా ఆ ఆర్థిక సాయాన్ని అందజేశారు. సురేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా. లక్ష్యం సివిల్ సర్వీసు సాధించడం.
కానీ అతని ఆర్థిక స్థోమత అందుకు అడ్డం పడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో లండన్కు చెందిన తెరాస ఎన్నారై సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను ఈ-మెయిల్ ద్వారా అతను సంప్రదించాడు. దీంతో స్పందించింది. సాయానికి ముందుకు వచ్చింది.
జన్మదిన
వేడులకు
దూరంగా
ఉండాలని
తెరాస
పార్టీ
అధ్యక్షుడు
కె.
చంద్రశేఖరరావు
నిర్ణయించుకున్నారు.
దీంతో
ఆ
వేడుకలకు
అయ్యే
ఖర్చు
మొత్తం
రూ.
25
వేలను
సురేష్కు
సాయంగా
అందివ్వాలని
నిర్ణయించింది.
ఈ మేరకు ఇటీవల కెసిఆర్ చేతుల మీదుగా విద్యార్థి సురేశ్ రూ.25 వేల చెక్కును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎన్నారై సెల్ తెలంగాణ కో-ఆర్డినేటర్ జి. రఘురాం పాల్గొన్నారు.