వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహ్రెయిన్‌లో తెలంగాణ సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRIs meet on Telangana issue
బహ్రెయిన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఉపశాఖ బహ్రెయిన్ సెల్ సమావేశం తొలిసారి ఈ నెల 24వ తేదీన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో సాగే ఉద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తామంటూ బహ్రెయిన్ ఎన్నారైలు ముందుకు వచ్సారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చేయూత ఇస్తామని వారు చెప్పారు.

తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అభివృద్ధికి తమ వంత సాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు. బహ్రెయిన్ ఎన్నారైలను ఉద్దేశించి తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్, అనిల్ కూర్మాచలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ ముందుకు రావాలని వారు సూచించారు.

ముందుగా కొవ్వొత్తులు వెలిగించి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన యువకుల ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. బలిదానాలు అపి ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సాధన దిశగా పనిచేయాలని వారు తెలంగాణ యువకులను కోరారు.

సడక్ బంద్ సందర్భంగా కోదండరామ్ తదితరులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె రాజు, పి. శ్రీధర్, పి. ఏడుకొండలు, ఎస్ విజయ్ కాంత్, కె. మజీద్, సి ప్రవీణ్, పి. చేరాలు, యాదగిరి, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

English summary
On its first meeting Telangana NRI forum Bahrain unit extended its support tp Telangana movement demanding separate state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X