వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒయు విద్యార్థికి రజత పతకం

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: ఈ నెల 23వ తేదీన లండన్‌లో జరిగిన ఇంగ్లాండు ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండ్ పోటీల్లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థికి రజత పతకం దక్కింది. ఈ పోటీల్లో భారతదేశం తరఫున మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి కరాటే రాజు పాల్గొన్నాడు. అతను రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.

దేశం కోసం రజత పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని కరాటే రాజు అన్నాడు. ప్రోత్సాహం లభిస్తే అనేక పతకాలు సాధించగలనని అన్నాడు.

కాగా, తైక్వాండ్ పోటీల్లో రజత పతకం సాధించిన కరాటే రాజుకు లండన్‌లోని తెలంగాణ సంఘాలు సన్మానం చేశాయి. తెలంగాణ ఎన్నారై సంఘం, టిఆర్ఎస్ ఎన్నారై విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కరాటే రాజుకు ఘనంగా సత్కారం జరిగింది.

రాజు శానబోయిన అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో తిరుపతి, నగేశ్ రెడ్డి, వంసీ, హరిగౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. గంప వేణుగోపాల్, ఉదయ్, నాగరాజు, అశోక్ కుమార్ ఈ సందర్భంగా ప్రసంగాలు చేశారు. కేంద్ర, ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు.

ఒయు విద్యార్థికి రజత పతకం

ఇంగ్లాండు అంతర్జాతీయ తైక్వాండ్ పోటీల్లో రజత పతకం పొందిన కరాటే రాజు

ఒయు విద్యార్థికి రజత పతకం

ఇంగ్లాండు అంతర్జాతీయ తైక్వాండ్ పోటీల్లో రజత పతకం స్వీకరించిన కరాటే రాజు

ఒయు విద్యార్థికి రజత పతకం

తెలంగాణ ఎన్నారైల సన్మాన కార్యక్రమంలో కరాటే రాజు

ఒయు విద్యార్థికి రజత పతకం

తెలంగాణ ఎన్నారైల సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కరాటే రాజు

English summary
Osmania University student from Mahaboobnagar district Karate Rahu has won silver medal in England open Taikvand tournment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X