NRI News: తప్పిపోయి 12 రోజుల తర్వాత దొరికిన ఎన్నారై..
ముంబైలో ఓ ఎన్నారై తప్పిపోయి 12 రోజుల తర్వాత దొరికాడు.
జ్ఞాపకశక్తి లోపంతో డర్బన్లో రిటైర్డ్ క్లర్క్ అయిన అరవై తొమ్మిదేళ్ల ధ్రామలింగం పిళ్లే జనవరి 31న సహర్లోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తప్పిపోయారు. 12 రోజుల తర్వాత అతని ఆచూకీ లభించింది. దీంతో అతన్ని అతని కూతురుకు అప్పగించారు.ఇద్దరు వ్యక్తుల సహాయంతో పిళ్లే ఆదివారం నాడు 14వ రోడ్డులో తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో రోడ్డుపై తిరుగుతున్నట్లు గుర్తించి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు.
ముంబై మిర్రర్లో పిళ్లేపై వచ్చిన కథనాన్ని చదివి తెలుసుకున్న మరొక నివాసి.. పిళ్లేను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ద్రమలింగం పిళ్లే(69) అతని కుమార్తె రబెక్కా 12 రోజుల నిరీక్షణ తర్వాత దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లారు. పిళ్లై స్వల్పకాలిక జ్ఞాపకశక్తితో బాధపడుతున్నారని, బెంగళూరులోని స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇద్దరూ భారత్కు వచ్చామని అతని కూతరు రాబెక్కా తెలియజేసింది.

రబెక్కా తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదుతో సహార్ పోలీస్ స్టేషన్కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ గోవిల్కర్, ఇన్స్పెక్టర్ విశాల్ పాదిర్, సబ్-ఇన్స్పెక్టర్ సుశాంత్ బవాచ్కర్లతో కూడిన 35 మంది పోలీసుల బృందం రైల్వే స్టేషన్లు (ముంబై, థానే, నవీ ముంబై), ఆసుపత్రులు, శవాగారాల నుంచి వివరాలను సేకరించారు. షెల్టర్ హోమ్లు, బిచ్చగాళ్ల సంఘం, NGOలు, విమానాశ్రయం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న CCTV కెమెరా దృశ్యాలు పరిశీలించారు. చివరికి పిళ్లే ఆచూకీ కనుగొన్నారు.
సహార్ పోలీస్ స్టేషన్లో తన కుమార్తె రబెక్కాను చూసి పిళ్లే ఏడ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో ఖార్ 14వ రోడ్డులో జి గోమ్స్కి పిళ్లే కనిపించాడు. గోమ్స్ పోలీసు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి పిళ్లే గురించి తెలియజేశాడు. ఖర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహదేవ్ నింబాల్కర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సంతోష్ కాన్సే జోనల్ అక్కడికి చేరుకుని పిళ్లేను పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications