వైయస్సార్ ఫౌండేషన్(యుఎస్) ఆధ్వర్యంలో అన్నదానం(పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికాలోని డాక్టర్ వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా 10వేల మంది నిరుపేదలకు ఫుడ్ బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఆహారాన్ని సమకూర్చినట్లు నిర్వాహకులు న్యూజెర్సీ నుంచి అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
డా. వైయస్సార్ ఫౌండేషన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతియేటా నిర్వహణలో భాగంగా ఫుట్ డ్రైవ్ కార్యక్రమాన్ని జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు. అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, చార్లేట్, డల్లాస్, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, రాలీ, వర్జీనియా నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ శాఖల ఆధ్వర్యంలో ముందుగా విరాళాలు, ఆహార వస్తువులను సేకరించడం జరిగిందని చెప్పారు.
సేవా సంస్థలు, మిషనరీలు, ఫుడ్ బ్యాంకుల ద్వారా అన్నార్థులకు ఆహారాన్ని సమకూర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్లోని పీపుల్ టు పీపుల్ ఫుడ్ బ్యాంక్, డెన్విల్లోని సెయింట్ పీటర్స్ అనాదాశ్రమం, నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్, ఆస్టిన్ రిసోర్స్ సెంటర్ ఫర్ హోంలెస్, మూర్స్వెల్ క్రిస్టియన్ మిషన్, ది నేషనల్ కొయిలేషన్ ఫర్ హోంలెస్(అట్లాంటా, జార్జియా) వంటి అనేక సంస్థలతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ కార్యవర్గం ఉత్సాహంగా పాల్గొందని తెలిపారు.

వైయస్సార్ ఫౌండేషన్
అమెరికాలోని డాక్టర్ వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు.

వైయస్సార్ ఫౌండేషన్
ఈ కార్యక్రమం ద్వారా 10వేల మంది నిరుపేదలకు ఫుడ్ బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఆహారాన్ని సమకూర్చినట్లు నిర్వాహకులు న్యూజెర్సీ నుంచి అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వైయస్సార్ ఫౌండేషన్
డా. వైయస్సార్ ఫౌండేషన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతియేటా నిర్వహణలో భాగంగా ఫుట్ డ్రైవ్ కార్యక్రమాన్ని జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు.

వైయస్సార్ ఫౌండేషన్
అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, చార్లేట్, డల్లాస్, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, రాలీ, వర్జీనియా నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ శాఖల ఆధ్వర్యంలో ముందుగా విరాళాలు, ఆహార వస్తువులను సేకరించడం జరిగిందని చెప్పారు.

వైయస్సార్ ఫౌండేషన్
సేవా సంస్థలు, మిషనరీలు, ఫుడ్ బ్యాంకుల ద్వారా అన్నార్థులకు ఆహారాన్ని సమకూర్చడం జరిగిందన్నారు.

వైయస్సార్ ఫౌండేషన్
ఈ కార్యక్రమంలో న్యూయార్క్లోని పీపుల్ టు పీపుల్ ఫుడ్ బ్యాంక్, డెన్విల్లోని సెయింట్ పీటర్స్ అనాదాశ్రమం, నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్, ఆస్టిన్ రిసోర్స్ సెంటర్ ఫర్ హోంలెస్, మూర్స్వెల్ క్రిస్టియన్ మిషన్, ది నేషనల్ కొయిలేషన్ ఫర్ హోంలెస్(అట్లాంటా, జార్జియా) వంటి అనేక సంస్థలతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు రామిరెడ్డి తెలిపారు.

వైయస్సార్ ఫౌండేషన్
ఈ కార్యక్రమంలో అన్ని నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ కార్యవర్గం ఉత్సాహంగా పాల్గొందని తెలిపారు.
-
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications