Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నారై యువతికి బాలల శాంతి బహుమతి(ఫొటోలు)

వాషింగ్టన్: అమెరికాలో నివాసముంటున్న ప్రవాస భారతీయురాలు నేహా గుప్తా(18)కి ఈ ఏడాదికి గాను అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపికయ్యారు. భారతదేశంతోపాటు అమెరికాలోని అనాథ పిల్లల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నేహా గుప్తాకి ఈ వార్డు దక్కింది.

మంగళవారం ది హేగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నెదర్లాండ్ష్ రాజు విలెం అలెగ్జాండర్, నోబెల్ శాంతి బహుమతి విజేత, మాజీ అర్చిబిషప్ డెస్మండ్ టాటూ ఈ అవార్డును నేహాకు అందజేశారు.

నేహా గుప్తా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొగ్రాం చేస్తున్నారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే భారతదేశంలోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన నేహా, ఆ తర్వాత అనాథ పిల్లల కోసం ‘ఎంపవర్ ఆర్ఫాన్స్' పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.

Indian-American student wins 2014 International Children's Peace Prize

ఇప్పటి వరకు 25వేల మందికిపైగా అనాథ చిన్నారులకు ఈ సంస్థ చేయూతనందించింది. ఈ సంస్థ చిన్నారులకు విద్యనందించడం, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం లాంటి వసతులను కల్పిస్తోంది. కాగా, నిరుడు ఈ అవార్డును పాకిస్థాన్ బాలికల విద్యా హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్‌ అందుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+