వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌: అనుమానాస్పద స్థితిలో ఎన్నారై ఫ్యామిలీ మృతి

|
Google Oneindia TeluguNews

లండన్: ఓ భారత సంతతి కుటుంబం తూర్పు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భార్య, ఇద్దరు కవల పిల్లల మృతదేహాలను మంగళవారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు, తూర్పులండన్‌లోని రిజర్వాయర్ వద్ద ఉరివేసుకున్న కుటుంబ యజమానిని గురువారం గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేరళకు చెందిన రితీష్‌కుమార్ పుల్లార్‌కట్టిల్ (44), సింఘి రితీష్(37), వారి ఇద్దరు కవల పిల్లలు నివ్యా, నేహ (13) తూర్పులండన్‌లో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. కాగా, అనుమానాస్పదస్థితిలో ఇంట్లో చనిపోయిన సింఘి రితీష్, వారి ఇద్దరు కవల పిల్లలు నివ్యా, నేహ మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.

Indian family of 4 at heart of tragic death inquiry in UK

కుటుంబ యజమాని రితీష్‌కుమార్ పుల్లార్‌కట్టిల్ కోసం గాలిస్తుండగా ఈశాన్య లండన్‌లోని రిజర్వార్ సమీపంలో గురువారం ఉరివేసుకుని కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతుల బంధువుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు.

పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా చనిపోయింది తెలుస్తుందని కేసు పరిశోధనాధికారి కెన్నీ మెక్‌డోనాల్డ్ చెప్పారు. అయితే వారి మృతికి ఆర్థిక సమస్యలా లేక కుటుంబ కలహాలు కారణమా అనేది తెలియరాలేదు.

English summary
An Indian-origin man was found hanging today near a reservoir in east London after the bodies of his wife and twin daughters were discovered at their family home, prompting Scotland Yard to launch an investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X