వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై దంపతులు, ఆయా అరెస్ట్

|
Google Oneindia TeluguNews

arrested
న్యూయార్క్: 19 నెలల చిన్నారి హత్య కేసులో భారతదేశానికి చెందిన ఆ చిన్నారి తల్లిదండ్రులను, వారితోపాటు వారి చిన్నారికి ఆయాగా పని చేసిన మహిళను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తనను తీవ్రంగా విసిగిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఆ ఆయా చిన్నారిని నెలకేసి కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆ చిన్నారి మృతి చెందాడు.

హత్యా నేరం కింద ఆయాగా పని చేస్తున్న కింజల్ పటేల్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను ఆ చిన్నారి అథియాన్ శివకుమార్ చాలా విసిస్తున్నాడనీ, దీంతో ఆగ్రహానికి గురైన తాను పాపను కిందకి విసిరేశానని చెప్పింది. ఈ ఘటన జనవరి 16న న్యూహవెన్‌లో చోటు చేసుకుంది.

కింజల్ పటేల్ కింద విసిరేయడం వల్ల అథియాన్ శివకుమార్‌కు గాయాలయ్యాయని థెన్మోజి రాజేంద్రన్.. మణి శివకుమార్‌కు చెప్పడంతో హుటాహుటిన అక్కడి చేరుకున్నాడు. వెంటనే అథియాన్‌ను ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలైన కారణంగా అథియాన్ శివకుమార్ ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కాగా మృతి చెందిన అథియాన్ శివకుమార్ తల్లిదండ్రులు థెన్మోజి రాజేంద్రన్ (24), మణి శివకుమార్ (33)లను కూడా హత్యకు కారణమయ్యారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Indian-origin parents of a 19-month-old baby, who died of severe head injuries after his babysitter got angry and dumped him on the floor, have been arrested and charged in the US state of Connecticut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X