భారీ అలలు: భారత సంతతి ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త బాలి బీచ్లో మృతి
జకార్తా: ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, ప్రపంచ బ్యాంక్ అనుంబంధంగా పనిచేస్తున్న ఆకాన్షా పాండే ఇండోనేషియాలోని బాలి బీచ్లో మృతిచెందారు. శనివారం సాయంత్రం బీచ్లోని నిషేధిత ప్రాంతంలో ఆమె స్విమ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన అలలు ఒక్కసారిగా ఆమెను తాకడంతో ఆకాన్షా ప్రవాహంలో కొట్టుకుపోయారు.
బీచ్ లైఫ్గార్డ్ ఆమెని కాపాడేందుకు ప్రయత్నించారు. అలల్లో కొట్టుకుపోతున్న ఆమెను బయటకు తీసుకువచ్చిన సిబ్బంది.. వెంటనే ఆమెను సిలోమ్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆకాన్షా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

భారత్ సంతతికి చెందిన ఆకాన్షా ప్రస్తుతం యూఎస్లో ఉంటున్నారు. ప్రపంచ బ్యాంక్లో సీనియర్ హెల్త్ ఎకనామిస్ట్గా ఆమె పనిచేస్తున్నారు. కాగా, అకాన్షా స్విమ్ చేస్తున్న ప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని బీచ్ అధికారులు తెలిపారు.
అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు సూచికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ, ఆకాన్షా వాటిని పట్టించుకోలేదని, లైఫ్గార్డ్లు హెచ్చరించినా కూడా ఆమె వినలేదని తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications