పర్యాటకం: సింగపూర్లో ఖర్చు మనోళ్లదే అధికం!
అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారతీయుల రాక కొంత తగ్గిందని తెలిపింది. దీంతో సింగపూర్ డాలర్ రేట్(ఎస్జిడి) 284 మిలియన్ల వద్ద 3శాతం తగ్గిందని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో 65,557 మంది భారతీయులు సింగపూర్ను సందర్శించారని తెలిపింది. నిరుడితో పోల్చితే ఇది 7.9శాతం తక్కువగా ఉందని పేర్కొంది.
ఫిబ్రవరిలో నెలలో 62,999 మంది భారతీయులు సింగపూర్ను సందర్శించారని, ఇది నిరుడితో పోల్చితే 5.6శాతం పెరిగిందని తెలిపింది. అదే మార్చిలో 70,472 మంది భారత పర్యాటకులు ఇక్కడికి వచ్చారని సింగపూర్ టూరిజం బోర్డ్ తెలిపింది. ఇందులో నిరుడితో పోల్చితే తేడా ఏమి లేదని చెప్పింది. అయితే పర్యటనకు వచ్చిన వారి సంఖ్యతో నిమిత్తం లేకుండా భారతీయుల ఖర్చు మాత్రం ఇక్కడ పెరిగిందని తెలిపింది.
మొత్తంగా చూసుకున్నట్లయితే మొదటి త్రైమాసికంలో పర్యాటక ఆదాయం ఎస్జిడి 6 బిలియన్ల వద్ద 5శాతం పెరిగిందని తెలిపింది. 3.9 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ఈ మొత్తం వచ్చినట్లు తెలిపింది.