అమెరికాలో విద్యా సదస్సు: భారీ స్పందన(పిక్చర్స్)
న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలోని హైస్కూళ్ళలో చదువుకుంటున్న భారత, ఆసియాఖండానికి చెందిన విద్యార్ధులకు ఉన్నత చదువులను అందించేందు కోసం ప్రముఖ కంపెనీ మెక్డోనాల్డ్ నిర్వహించిన విద్యా అవగాహ సదస్సుకు భారీ స్పందన వచ్చింది.
విద్యార్థుల ఉన్నత చదువు కోసం మంచి యూనివర్సిటీల్లో చేరడానికై కావలసిన అర్హతలు, సులభంగా లభ్యం అయ్యే ఆర్ధిక సహాయం అనే అంశాలపై ఆదివారం డల్లాస్ జాన్పాల్ హైస్కూల్లో జరిగిన ఈ విద్యా అవగాహనా సదస్సుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ టెక్సాస్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

విద్యా సదస్సు
అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలోని హైస్కూళ్ళలో చదువుకుంటున్న భారత, ఆసియాఖండానికి చెందిన విద్యార్ధులకు ఉన్నత చదువులను అందించేందు కోసం ప్రముఖ కంపెనీ మెక్డోనాల్డ్ నిర్వహించిన విద్యా అవగాహ సదస్సుకు భారీ స్పందన వచ్చింది.

విద్యా సదస్సు
విద్యార్థుల ఉన్నత చదువు కోసం మంచి యూనివర్సిటీల్లో చేరడానికై కావలసిన అర్హతలు, సులభంగా లభ్యం అయ్యే ఆర్ధిక సహాయం అనే అంశాలపై ఆదివారం డల్లాస్ జాన్పాల్ హైస్కూల్లో జరిగిన ఈ విద్యా అవగాహనా సదస్సుకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ టెక్సాస్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

విద్యా సదస్సు
డాక్టర్. తోటకూర మాట్లాడుతూ.. మంచి యూనివర్సిటీల్లో చేరాలంటే కేవలం మంచి మార్కులు సరిపోవని, తొమ్మిదవ తరగతి నుండే విద్యార్ధులు మంచి మార్కులతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర విద్యార్ధులకు సహాయపడటం అనే నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

విద్యా సదస్సు
ముఖ్యఅతిధి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి డేవిడ్ కుసిన్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హార్వర్డ్లో చేరడానికి 36,000 దరఖాస్తులు వస్తాయని, కేవలం 2,000 మందికి మాత్రమే ప్రవేశం లభిస్తుందని అన్నారు.
దాదాపు 300 మంది విద్యార్థులు హాజరైన సమావేశంలో డాక్టర్. తోటకూర మాట్లాడుతూ.. మంచి యూనివర్సిటీల్లో చేరాలంటే కేవలం మంచి మార్కులు సరిపోవని, తొమ్మిదవ తరగతి నుండే విద్యార్ధులు మంచి మార్కులతో పాటు,
సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర విద్యార్ధులకు సహాయపడటం అనే నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
ముఖ్యఅతిధి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి డేవిడ్ కుసిన్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హార్వర్డ్లో చేరడానికి 36,000 దరఖాస్తులు వస్తాయని, కేవలం 2,000 మందికి మాత్రమే ప్రవేశం లభిస్తుందన్నారు. రిజర్వేషన్స్ కాని
రికమండేషన్లు గానీ పనిచేయవని, కేవలం ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రిచర్డ్సన్ నగర మేయర్ లోరా మజక, సథరన్ న్యూస్ గ్రూప్ చైర్మన్ విలీ, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి ఏన్జీ చెన్ బటన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications