వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ మీట్ అండ్ గ్రీట్

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో శనివారం మీట్ అండ్ గ్రీట్ సమావేశం జరిగింది.

|
Google Oneindia TeluguNews

న్యూ జెర్సీ : ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో శనివారం మీట్ అండ్ గ్రీట్ సమావేశం జరిగింది. న్యూ జెర్సీలోని ఆసియా టీవీ స్టూడియోలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, తెలంగాణ భారతీయ జనతా కిసాన్ మోర్చా అధ్యక్షులు మరియు ఎన్ఐఈఎం డైరెక్టర్ , శ్రీ మధుసూదన్ రెడ్డి గోలి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

శ్రీ మధుసూదన్ రెడ్డి గోలి గారు ఈ సందర్భముగా కేంద్రంలో ఉన్న శ్రీ మోడీ గారి ప్రభుత్వం రైతులకోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలైన.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, గిట్టుధరల పెంపకం, E-NAM, 24గం. విద్యుత్, నదుల అనుసంధానం, వేప పూత పూసిన యూరియా , సాయిల్ హెల్త్ కార్డు మొదలైన వాటిని గురించి క్లుప్తంగా వివరించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను గురించి తెలిపారు.

అదేవిధంగా, తెలంగాణలో రైతు హత్యలకు దారి తీస్తున్న కారణాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరిగితే భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా లబ్ది చేకూరుతుంది అన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలకు తూట్లు పొడుస్తుందన్నారు.

Meet and greet meet of nri bjp members

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మధుసూదన్ రెడ్డి గారు సువివరముగా సమాదానాలు చెప్పారు.

ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్ శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గారు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు భరత్ రెడ్డి గోలి, ప్రదీప్ రెడ్డి కట్ట, శ్రవణ్ , సంతోష్ గార్ల తో పాటు తానా నుండి లక్ష్మి దేవినేని, ఆటా నుండి రవీందర్ , సాయి దత్త పీఠం నుండి రఘు శర్మ , మధు అన్న , స్వరజ్ నుండి జగదీశ్వర్ , అనంత్ , టాటా నుండి మేకల సతీష్ చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.

English summary
Meet and Greet of overseas BJP members program coducted in Newjersey.NIAEM director Sri Madhusudhan Reddy Goli was attended to this program as a chief guest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X