కువైట్ మినీ మహానాడు.. నారా లోకేష్ కు ఆహ్వానం
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కువైట్ లో జరగబోయే మినీ మహానాడులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రముఖ ఎన్నారై, కువైట్ టీడీపీ అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ ను కలిసి మినీ మహానాడుకు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. కువైట్ లో మే 20వ తేదీన మినీ మహానాడు బహిరంగ సభ జరుగుతుందని, కువైట్ లో ఉన్న దాదాపు 2 లక్షల మంది తెలుగు వారిలో ఎక్కువమంది టీడీపీ అభిమానులేనని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని తెలియజేశారు.
నారా లోకేష్ రాక కోసం అక్కడి తెలుగువారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు సుధాకర రావు. కాగా సుధాకర రావు అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన లోకేష్.. ఏపీ ఎన్నారై మంత్రి రఘునాధ రెడ్డి, ఏ.పి.ఎన్నారై చీఫ్ వేమూరి రవి కుమార్ గారితో కలిసి కువైట్ పర్యటనకు వస్తానని తెలియజేశారు లోకేష్ బాబు. ఈ సందర్భంగా కువైట్ టీడీపీ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి లోకేష బాబుకు వివరించారు సుధాకర రావు.
అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ కు అంబులెన్స్ ను బహూకరించారు సుధాకర రావు. పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత నారా లోకేష్ జెండా ఊపి అంబులెన్స్ ను ప్రారంభించారు. తరువాత జరిగిన విలేకరుల సమావేశములో ఎన్టీఆర్ ట్రస్ట్ సి.ఈ.వో. విష్ణు వర్ధన్, సుధాకర రావు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే అంబులెన్స్ ను బహూకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆ తర్వాత మాట్లాడిన సుధాకర రావు.. విదేశాల్లో ఉండే వ్యక్తులెవరైనా దురదృష్ట వశాత్తు అనారోగ్యం పాలవడమో..! లేక మరణించడమో..! జరిగితే అలాంటివారిని చెన్నై, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి నేరుగా వారి ఇళ్లకు చేరవేయాలనే సదుద్దేశ్యంతో అంబులెన్స్ ను బహూకరించినట్టుగా తెలిపారు.
ఎన్టీఅర్ ట్రస్ట్ తరుపున మరిన్ని మంచికార్యక్రమాలకు గల్ఫ్ దేశాలలో శ్రీకారం చుడుతామన్నారు. దీంతో పాటు ఎన్టీఅర్ ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లోను తన ప్రాతినిథ్యం తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు.
గుంటూరు జిల్లాలోని బొబ్బర్లంక కుదరవల్లి సుధాకర రావు స్వగ్రామం. గడిచిన పదిహేనేళ్లుగా ఆయన కువైట్ లో ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎన్నారై చీఫ్ రవి వేమూరి, బుచ్చిరాం, నిరంజన్, మురళి గారు, శరత్, వెంకట అప్పా రావు, నాగేంద్ర బాబు, కాపెర్ల పట్టభి రాము సహా తదితరులు పాల్గొన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications