కువైట్ మినీ మహానాడు.. నారా లోకేష్ కు ఆహ్వానం
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కువైట్ లో జరగబోయే మినీ మహానాడులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రముఖ ఎన్నారై, కువైట్ టీడీపీ అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ ను కలిసి మినీ మహానాడుకు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. కువైట్ లో మే 20వ తేదీన మినీ మహానాడు బహిరంగ సభ జరుగుతుందని, కువైట్ లో ఉన్న దాదాపు 2 లక్షల మంది తెలుగు వారిలో ఎక్కువమంది టీడీపీ అభిమానులేనని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని తెలియజేశారు.
నారా లోకేష్ రాక కోసం అక్కడి తెలుగువారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు సుధాకర రావు. కాగా సుధాకర రావు అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన లోకేష్.. ఏపీ ఎన్నారై మంత్రి రఘునాధ రెడ్డి, ఏ.పి.ఎన్నారై చీఫ్ వేమూరి రవి కుమార్ గారితో కలిసి కువైట్ పర్యటనకు వస్తానని తెలియజేశారు లోకేష్ బాబు. ఈ సందర్భంగా కువైట్ టీడీపీ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి లోకేష బాబుకు వివరించారు సుధాకర రావు.
అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ కు అంబులెన్స్ ను బహూకరించారు సుధాకర రావు. పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత నారా లోకేష్ జెండా ఊపి అంబులెన్స్ ను ప్రారంభించారు. తరువాత జరిగిన విలేకరుల సమావేశములో ఎన్టీఆర్ ట్రస్ట్ సి.ఈ.వో. విష్ణు వర్ధన్, సుధాకర రావు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే అంబులెన్స్ ను బహూకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆ తర్వాత మాట్లాడిన సుధాకర రావు.. విదేశాల్లో ఉండే వ్యక్తులెవరైనా దురదృష్ట వశాత్తు అనారోగ్యం పాలవడమో..! లేక మరణించడమో..! జరిగితే అలాంటివారిని చెన్నై, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి నేరుగా వారి ఇళ్లకు చేరవేయాలనే సదుద్దేశ్యంతో అంబులెన్స్ ను బహూకరించినట్టుగా తెలిపారు.
ఎన్టీఅర్ ట్రస్ట్ తరుపున మరిన్ని మంచికార్యక్రమాలకు గల్ఫ్ దేశాలలో శ్రీకారం చుడుతామన్నారు. దీంతో పాటు ఎన్టీఅర్ ట్రస్ట్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లోను తన ప్రాతినిథ్యం తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు.
గుంటూరు జిల్లాలోని బొబ్బర్లంక కుదరవల్లి సుధాకర రావు స్వగ్రామం. గడిచిన పదిహేనేళ్లుగా ఆయన కువైట్ లో ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎన్నారై చీఫ్ రవి వేమూరి, బుచ్చిరాం, నిరంజన్, మురళి గారు, శరత్, వెంకట అప్పా రావు, నాగేంద్ర బాబు, కాపెర్ల పట్టభి రాము సహా తదితరులు పాల్గొన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications