చంద్రబాబు, నారా లోకేష్లతో ఎన్నారై భేటీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్లను కువైట్ తెలుగుదేశం నాయకుడు, తెలుగు కళా సమితి ఉపాధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు సోమవారం కలిశారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం పట్ల ఆయన వారికి అభినందనలు తెలియజేశారు.
అలాగే లోకేష్ను కువైట్లో జరపబోతున్న తెలుగుదేశం విజయోత్సవ సభకి ఆహ్వానించారు. ముందుగా నారా లోకేష్ను కలిసిన సుధాకర్ రావు, ఆ తర్వాత లేక్వ్యూ గెస్ట్ హౌజ్లో చంద్రబాబు నాయుడును కలిసి అభినందనలు తెలియజేశారు.
బాబుకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్లను కువైట్ తెలుగుదేశం నాయకుడు, తెలుగు కళా సమితి ఉపాధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు సోమవారం కలిశారు.
బాబుకు ఆహ్వానం
ఇటీవలి ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం పట్ల ఆయన వారికి అభినందనలు తెలియజేశారు.
బాబుకు ఆహ్వానం
అలాగే చంద్రబాబు, లోకేష్లను కువైట్లో జరపబోతున్న తెలుగుదేశం విజయోత్సవ సభకి ఆహ్వానించారు.
బాబు, లోకేష్లకు ఆహ్వానం
ముందుగా నారా లోకేష్ను కలిసిన సుధాకర్ రావు, ఆ తర్వాత లేక్వ్యూ గెస్ట్ హౌజ్లో చంద్రబాబు నాయుడును కలిసి అభినందనలు తెలియజేశారు.
బాబు, లోకేష్లకు ఆహ్వానం
కువైట్లో తెలుగు వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సుధాకర్ రావు తీసుకువెళ్లారు.
బాబు, లోకేష్లకు ఆహ్వానం
నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా మరికొంత మంది ప్రవాసాంధ్రులతో కలిసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని కూడా చంద్రబాబుకు తెలియజేశారు. దీనిపై ఆయనతో చర్చించారు.
కువైట్లో తెలుగు వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి పాస్ పోర్టు కార్యాలయాలలో పిసిసి ఇవ్వడం కోసం వారు తీసుకుంటున్న సమయం, వారు అడుగుతున్న పత్రాలు, అవి సరైన సమయంలో రాలేక మనవారు పడే ఇబ్బందులు, కోల్పోతున్న ఉద్యోగ అవకాశాలను గురించి చంద్రబాబుకు వివరించారు. ఇందుకోసం సహాయాన్ని కోరుతూ చంద్రబాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు.
నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా మరికొంత మంది ప్రవాసాంధ్రులతో కలిసి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని కూడా చంద్రబాబుకు తెలియజేశారు. దీనిపై ఆయనతో చర్చించారు.