NRI News: ఎన్నారై మహిళను బ్లాక్ చేసిన వ్యక్తి అరెస్ట్..
లూథియానలో ఒక ఎన్నారై మహిళను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ అభ్యంతరకరమైన ఫొటోలను కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు షేర్ చేస్తానని నిందితుడి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సామ్రాలలోని రాంపూర్ గ్రామానికి చెందిన నివాసిపై సిటీ జాగ్రావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. లూథియానా రూరల్ డీఎస్పీ చైల్డ్ అండ్ ఉమెన్ సెల్ నిర్వహించిన విచారణ అనంతరం తరుణ్ కుమార్ అనే నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆ మహిళ 2023 అక్టోబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ 354ఏ, 354డీ, 294, 506, ఐటీ చట్టం 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో కేసులో ఖన్నా పోలీసులు ఒక వివాహిత మహిళ అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు జలంధర్ నివాసిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని జలంధర్లోని కింగ్రా గ్రామానికి చెందిన జగదీప్ సింగ్గా గుర్తించారు.

గతేడాది సెప్టెంబరు 3న మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సైబర్సెల్ ఖన్నా ఆధ్వర్యంలో విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ, నిందితుడితో తనకు ఇంతకు ముందు సంబంధం ఉంద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించడంతో నిందితుడు ఆమె అభ్యంతరకర ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
నిందితులపై ఐటీ చట్టంలోని 66ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ సిటీ ఖన్నా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హేమంత్ మల్హోత్రా తెలిపారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications