వాసవీ యూత్ ఎన్నారై ఆధ్వర్యంలో 13న వనభోజనాలు
దుబాయ్: వాసవీ యూత్ ఎన్నారై సంస్థ ఆధ్వర్యంలో దుబాయ్లో క్రేక్ పార్క్, గెట్ నెంబర్-4లో శుక్రవారం(నవంబర్ 13న) ఉదయం 9గంటలకు వైభవంగా కార్తీక మాసం వనభోజనాలు ప్రారంభమవుతాయని వాసవీ యూత్ ఎన్నారై సంస్థలోని నిర్వాహక ప్రతినిధులు జూలూరు సురేష్ కుమార్, రఘురాం సందీప్, కొప్పర్తి జయేష్, ప్రదీప్ తెలియజేశారు.
దుబాయ్లో ఘనంగా జరిగే ఈ కార్తీక మాస వన భోజన కార్యక్రమానికి ఆర్య వైశ్యులందరూ బంధుమిత్ర సపరివారంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, పూర్తిగా ఉచితమేనని వారు తెలిపారు.
దుబాయ్ ఆర్యవైశ్యు వాసులు ఈ కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్నిజయప్రదం చేయాలని వాసవీ యూత్ ఎన్నారై నిర్వాహకులు కోరారు. టీవీ యాంకర్ మృధుల కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తారని చెప్పారు.
ఇతర వివరాల కోసం ఆర్ఎస్విపి: 055 4207429,055 -5963436 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.