వాసవీ యూత్ ఎన్నారై వేడుకలు
దుబాయ్: దుబాయ్లోని వాసవి యూత్ ఎన్నారై ఆధ్వర్యంలో ఘనంగా గ్రాండ్ మెగా డెజర్ట్ సఫారీ జరిగింది. ఆర్య వైశ్యులందరికీ పలు సేవలు అందించే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటైంది. దుబాయ్లో ఉద్యోగాలు, భారత దేశంలో పేద వైశ్య విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించే ఉద్దేశంతో కొందరు దీన్నీ ఏర్పాటు చేశారు.
వాసవి యూత్ ఎన్నారై ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమం దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబాయ్లో ఉన్న 500 మందికి పైగా ఆర్య వైశ్యులు, అమెరికాకు చెందిన ఆర్య వైశ్యులు హాజరయ్యారు. అతిధులకు ఒంటె స్వారీ, డూన్ బాష్, బెల్లీ డ్యాన్స్లతో పాటు పలు ఆసక్తికరమైన ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎయిర్ ఇండియా విమానం టికెట్లు, వజ్రాల రింగులు అందించారు.
అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆంధ్రా వంటకాలైన గుత్తి వంకాయ , ఉలవ చారు అతిధులను విశేషంగా ఆకర్షించాయి. అతిథులలో కొందరు పేద వైశ్య విద్యార్ధులను చదివించడానికి ముందుకు వచ్చారు. రానున్న కాలంలో కూడా సంస్థను, దాని సేవలను మరింత విస్తృతం చేస్తామని వాసవి యూత్ ఎన్నారై చైర్మన్ జయేష్ , కమిటీ సభ్యులైన రఘురాం , సురేష్, రాజేశ్వరి తెలియచేసారు.
సుష్మ, హారిక ఈ కార్యక్రమానికి అన్నివిధాల సహాయ సహకారాలు అందించారు . ఈ కార్యక్రమాన్ని ఉచితంగా, అందులోనూ ఇంత ఘనంగా నిర్వహించినందులకు అతిధులు కార్యక్రమ నిర్వాహకులను, కార్య వర్గాన్ని అభినందించారు.