వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లోకి టీనేజీ బాలుడు.. పాక్ సైన్యం తిరిగి అప్పగింత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయ బాలుడుని పాకిస్ధాన్ సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది. కాశ్మీర్‌లోని ఝానగర్‌కు చెందిన మంజర్ హుస్సేన్ స్ధానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

నవంబర్ 14వ తేదీన పొరపాటున భారత్ - పాకిస్ధాన్ సరిహద్దు ప్రాంతమైన అసల్ కాస్ నుల్లా వద్ద నియంత్రణ రేఖను దాటి పాకిస్ధాన్‌లోకి అడుగుపెట్టాడు. తమ భూభాగంలోకి ప్రవేశించిన హుస్సేన్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని ఉన్నతాధికారులకు అప్పగించారు.

Pakistan army hands over Indian boy who crossed LoC inadvertently

దాంతో మంజర్ హుస్సేన్‌ను ఉన్నాతాధికారులు మంగళవారం విచారణ జరిపి చకోటి-యూరి కేంద్రం వద్ద భారత్ సైన్యానికి హుస్సేన్‌ను అప్పగించినట్లు పాక్ సైన్యం పేర్కొంది.74

శాతం జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు లేవు

ప్రధాని మంత్రి జన్‌ధన్ యోజన పథకంలో భాగంగా తెరిచిన 74 శాతం ఖాతాల్లో అసలు డబ్బులే లేవని స్వయంగా ప్రభుత్వమే వెల్లడించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 7.1 కోట్ల ఖాతాలు తెరిచారు. ఇందులో నాలుగింట మూడొంతుల ఖాతాల్లో రూపాయి కూడా జమకాలేదని సమచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌కు కేంద్రం జవాబిచ్చింది.

అయితే జన్‌ధన్ ఖాతాలన్నింటిలో జమైన మొత్తం ఇప్పటివరకు రూ.5,482 కోట్లకు చేరుకుందని తెలిపింది. దేశంలోని ప్రజలందరినీ బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తేవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టారు.

English summary
Pakistan army on Tuesday handed over a 13-year-old boy to Indian authorities after he had inadvertently crossed the Line of Contro
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X