జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో స్పెషల్ అట్రాక్షన్గా ఎంపీ శశి థరూర్
తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ నేత శశి థరూర్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన మోహిత్ సత్యానంద్తో రాజకీయ సంస్థలపై చర్చిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ ప్యానెల్ సభ్యులుగా ఉన్న శశి థరూర్ పెగాసస్ సాఫ్ట్వేర్ వ్యవహారంలో అక్రమ నిఘా వేసిన జర్జలిస్టులు రాజకీయనాయకుల గురించి చర్చించున్నారు. ఈ చర్చలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బీ లోకూర్ కూడా పాల్గొంటారు.
9వ రోజు ప్రధానాంశాలు
సినీ విమర్శకురాలు అనుపమ్ చోప్రా మరో ప్రముఖ వ్యక్తి శునాలీ ఖుల్లార్ ష్రాఫ్ తో వర్క్ అండ్ వర్షిప్ గురించి చర్చిస్తారు. కొన్ని సినిమాలు తన జీవితాన్ని తన కెరీర్ను ఎలా మలుపు తిప్పాయో వాటి అనుభవాలను షేర్ చేసుకుంటారు. బ్రిటీష్ రచయిత అవార్డు గ్రహీత రూత్ పడేల్ తాను రాసిన పుస్తకం టైగర్స్ ఇన్ రెడ్ వెదర్ : ఎ క్వెస్ట్ ఫర్ ది లాస్ట్ వైల్డ్ టైగర్స్ గురించి ఆసక్తికర విషయాలు చెబుతారు. పులులను ఎలా సంరక్షించుకోవాలో చెబుతారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మన భూమి ఎలాంటి పాత్ర పోషిస్తుంది.. భూమిపై వాతావరణంను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై చర్చిస్తారు.అటవీ ప్రాణుల సంరక్షకురాలు అవార్డు గ్రహీత నేహా సిన్హా కూడా ఈ చర్చలో భాగమవుతారు. మనము రక్షించుకోవాల్సిన 15 భారత జాతి పశుపక్ష్యాదుల గురించి చెబుతారు.

ఇక మరో చర్చలో ప్రముఖ సంగీత కళాకారులు వయోలినిస్ట్, కంపోజర్ అంబి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. శేఖర్ రవ్జియానీలు పాల్గొన్నారు. విశాల్ శేఖర్ సాధనారావ్ వంటి ప్రముఖులు సంగీతంపై చర్చించారు. ఇక హిందీ భాషపై కూడా చర్చ సాగుతుంది. హిందీ భాషతో యూట్యూబ్, ఇన్స్టా ఇతర సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ దాన్నే జీవనోపాధిగా మలుచుకున్నారు.

8వ రోజు జరిగిన రౌండప్
8వ రోజున జరిగిన చర్చలో రచయిత అనిరుధ్ కనిశెట్టి తాను రాసిన పుస్తకం లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్ గురించి చర్చించారు. దక్షిణ భారతాన్ని పాలించిన చాలుక్యులు, చోళులు గురించి వివరించారు. నాడు పాలించిన చోళులు చాలుక్యుల రాజనీతి నేటి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు. ఇక Jaipur Literature Festivalలో మీరు కూడా పాల్గొనాలంటే వెబ్సైట్ను సందర్శించి మీ పేరును రిజిస్టర్ చేసుకోండి.












Click it and Unblock the Notifications