మరుపురాని లోకసంచారికి నివాళి

ఆ ప్రతిస్పందనలను ఒక దగ్గర చేర్చి జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో రామయ్య విద్యా పీఠం మరుపురాని లోకసంచారి పేర ఒక పుస్తంగా వెలువరించింది. బాలగోపాల్ పై నివాళి వ్యాసాలను ఆ రకంగా తెలుగు సమాజానికి అందించింది. ఈ వ్యాసాల్లో బాలగోపాల్ వ్యక్తిత్వం, కార్యశీలత, సృజనశీలత, బౌద్ధిక ప్రపంచం వ్యక్తమైంది. పలు కోణాల నుంచి వారి వారి అనుభవాలను వ్యాసకర్తలు తమదైన పద్ధతిలో రాశారు. సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా తెలుగు సమాజం ప్రతిస్పందించిన తీరు ఈ వ్యాసాల్లో వ్యక్తమైంది. అన్నింటికన్నా బాలగోపాలో ఒక మానవుడు అనే విషయాన్ని ఈ వ్యాసాలు పట్టిస్తాయి.
వరవరరావు, హరగోపాల్, ఎం.కోదండరామ్, వేల్చేరు నారాయణరావు, కత్తి పద్మారావు వంటివారు రాసిన నివాళి వ్యాసాలతో పాటు పలువురి వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. గతంలో కెఎన్ వై పతంజలి బాలగోపాల్ పై రాసిన ప్రశంసాత్మక వ్యాసం కూడా ఇందులో ఉంది. దానికి తోడు, బాలగోపాల్ రాసిన కొన్ని సాహిత్య వ్యాసాలను మచ్చుకు ఇందులో చేర్చారు. సాహిత్యంపై కె. శ్రీనివాస్ చేసిన బాలగోపాల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఈ పుస్తకంలోని నివాళి వ్యాసాలు చదివితే మానవ మనుగడకు అర్థం చెబుతూ బాలగోపాల్ నడుచుకున్నతీరు, ఆలోచించిన వైనం మనకు బోధపడుతుంది.
(మరుపురాని లోకసంచారి, సం. జూలూరు గౌరీశంకర్, వెల: రూ. 50, ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని పుస్తకాల షాపులు)
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications