బివివి ప్రసాద్కు ఇస్మాయిల్ పురస్కారం

కవి బివివి ప్రసాద్ కు ఈ పురస్కారం పేరిట పదివేల రూపాయల నగదు, అభినందన పత్రం, జ్ఞాపక చిహ్నం 4 నవంబరు 2012 , ఆదివారం కాకినాడలో జరిగే ఇస్మాయిల్ స్మారకసభ లో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
అనుభూతివాద కవిగా ప్రసిద్ధులైన ఇస్మాయిల్ పాటించే కవిత్వప్రమాణాలను అనుసరించి, స్వచ్ఛమైన కవిత్వం రాసే కవుల సంపుటాలకు ప్రతి ఏటా ప్రకటించేపురస్కారాలలో భాగంగా బివివి ప్రసాద్ 'ఆకాశం ' కవితా సంపుటికి ఈ అవార్డు లభిస్తోంది.
సున్నితమైన స్వభావం, తాత్విక చింతన, ఆర్ద్రత కలిగిన బివివి ప్రసాద్, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉత్తమ హైకూ కవిగా ప్రసిద్ధులు. రెండుదశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న బివివి ప్రసాద్ ఇప్పటివరకూ మూడు హైకూ సంపుటాలూ, మూడు వచనకవితా సంపుటాలూ ప్రకటించారు. వీరి హైకూపై వ్యాసాలూ, విజయవాడ ఆకాశవాణిలో ఇచ్చిన ఇంటర్వ్యూ సాహిత్య విమర్శకుల ప్రశంసలు పొందాయి. వీరి హైకూ సాహిత్యం పలువురు హైకూ పరిశోధకులకు ఉపయుక్తమయింది. తన ఉదాత్తమైన కవితాభివ్యక్తితో, భావాలతో రాష్త్రవ్యాప్తంగా ప్రసిద్ధ కవులతో సహా, ఎందరో సాహిత్యవేత్తల అభిమానం పొందిన ప్రసాద్ కు ఈ అవార్డు రావటం పట్ల అనేకప్రాంతాలనుండి పలువురు సాహిత్యాభిమానులు హర్షం ప్రకటించారు.
కాగా, ఇప్పటికే 'ఆకాశం ' సంపుటికి విశ్వకళా పీఠం, హైదరాబాద్ వారి 'స్నేహనిధి పురస్కారం', గుంటూరుజిల్లా రచయితల సంఘం వారి 'సాహిత్య పురస్కారం ' లభించాయి.












Click it and Unblock the Notifications