అవార్డు రేసులో జుంప లహరి నవల
వాషింగ్టన్: భారతీయ అమెరికన్, ప్రముఖ రచయిత్రి జుంప లహిరి రచించిన ‘ది లోలాండ్' నవల అమెరికా నేషనల్ బుక్ అవార్డు 2013కు రేసులో ఉంది. జుంప లహిరి గతంలో పులిట్జర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
జుంప లహిరి రచించిన ‘ది లోలాండ్'తోపాటు టామ్ డ్యూరీ రచించిన ‘పసిఫిక్', ఎలిజమెత్ గ్రేవర్స్ ‘ది ఇండ్ ఆఫ్ ది పాయింట్', రచెల్ కుష్నర్ రచించిన ‘ది ఫ్లేమ్ త్రోవర్స్' రచనలు చేశారు. ది యంగ్ పీపుల్స్ లిటరేచర్, పోయిట్రి, నోటిఫికేషన్, ఫిక్షన్ కేటగిరీస్ ల రచనల ఎంపికను అక్టోబర్ 16న ప్రకటిస్తామని, విజేతలకు నవంబర్ 20న న్యూయార్క్ నగరంలో బహమతులు అందజేయనున్నట్లు అమెరికా నేషనల్ బుక్ హౌస్ ఫౌండేషన్ తెలిపింది.

జుంప లహరి లండన్లో జన్మించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రవాసులైన లహరి తల్లిదండ్రులు బ్రిటన్ కు వలస వెళ్లారు. లహరి ఇద్దరు సోదరులు కోల్కతాలో నివాససిస్తున్నారు. ప్రస్తుతం జుంప లహరి న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్లో నివాసం ఉంటున్నారు. తన గొప్ప రచన ‘ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మెలడీస్ కు పులిట్జర్ అవార్డుతోపాటు పెన్/హెమింగ్ వే అవార్డు గెలుచుకున్నారు.
న్యూయార్క్ టైమ్స్కు లహరి రచించిన ‘ది నమేసకే' నవలంపై ప్రసంశలు కురిపించింది. నవలను ఆ ఏడాదిలో వచ్చిన గొప్ప నవలలో ఒకటిగా యూఎస్ఏ టూడే, ఎంటర్ టైన్మెంట్ వీక్లీ, పలు ప్రచూరణ సంస్థలు ఎంపిక చేశాయి. ఈ నవల ఆధారంగా ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ ఓ సినిమాను చిత్రీకరించారు. లహరి రచించిన ‘అన్ అక్యుస్టడీ ఎర్త్'ను ఏడాదిలో ప్రచూరితమైన 10 గొప్ప పుస్తకాల్లో ఒకటిగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
అమెరికాలో భారతదేశం నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి జీవితాన్ని అలవర్చుకోవడానికి పడే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆమె తన కొత్త నవల ‘ది లోలాండ్'నవలలో పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచూరించింది. లహరి చాలా దగ్గర్నుంచి క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతనే నవలను రచించినట్లు ఉందని టైమ్స్ పేర్కొంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications