Planetary Parade 2025: నేడు ఆకాశంలో మహాద్భుతం..ఏం జరగబోతోంది..?
Planetary Parade 2025:ఆకాశంలో అద్భుతాలను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపుతాం. నింగిలో కనిపించే నక్షత్రాల నుంచి తోక చుక్కల వరకు, గ్రహాల నుంచి గ్రహ శకలాల వరకు ఇలా ఎలాంటి అద్భుత ఘటనలు జరిగినా ఆ విశేషాలను తెలుసుకునేందుకు లేదా చూసేందుకు పిల్లల నుంచి పండుముదసలి వరకు ఆసక్తి చూపుతారు. ఇక జీవితకాలంలో ఒక్కసారి ఆకాశంలో కనిపించే సుందరదృశ్యాలైతే ఎవరూ మిస్ చేసుకోరు. అలాంటి అద్భుతమైన ఒక ఖగోళ దృగ్విషయం ఈ జనవరి 21వ తేదీన కనువిందు చేయనుంది. ఆరు గ్రహాలు భూమికి సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి.
జనవరి 21వ తేదీ ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో దర్శనమివ్వనున్నాయి. ఇది జీవితకాలంలో ఒక్కసారి జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని (Saturn), బృహస్పతి (Jupiter), అంగారకుడు(Mars),శుక్రుడు (Venus),నెప్ట్యూన్ (Neptune), యురేనస్ (Uranus)గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. యురేనస్, నెప్ట్యూన్లను చూడాలంటే టెలిస్కోప్ తప్పనిసరి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనుంది. జనవరి 21వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకేవరుసలో దర్శనమివ్వనున్నాయి.

భారత్లో ఈ గ్రహాల అమరికను ఎలా చూడాలి..?
21 జనవరి 2025 నుంచి ఒకే వరుసలో గ్రహాల అమరికి దృశ్యం భారత్లో కనిపిస్తుంది. ఈ ప్లానెట్ పరేడ్ దాదాపుగా నాలుగు వారాల పాటు ఆకాశంలో కనువిందు చేస్తుంది. దీంతో నింగిలో జరిగే అద్భుతాలను వీక్షించేందుకు తగిన సమయం లభిస్తుంది. ఈ గ్రహాలను ఎలాంటి పరికరాలు వినియోగించకుండా నేరుగా కళ్లతో చూడొచ్చా అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. శుక్రుడు (Venus), అంగారకుడు (Mars),బృహస్పతి (Jupiter),శని (Saturn) గ్రహాలను నేరుగా కళ్లతో వీక్షించొచ్చు.అయితే నెప్ట్యూన్, యూరేనస్ గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.
సూర్యాస్తమయం అయ్యాక ఈ గ్రహాలు ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంక క్లియర్గా చెప్పాలంటే రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్లానెట్ పరేడ్ అత్యంత సుందరంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించడం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. స్థానిక వాతావరణం, ఆ ప్రాంతంలో కాలుష్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ సుందర దృశ్యం స్పష్టంగా కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కాంతి,కాలుష్యం తక్కువ స్థాయిలో ఉండే ప్రదేశాల్లో ఈ గ్రహాల అమరిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కాలుష్యం అతితక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచి వీక్షిస్తే ఈ ఖగోళ అద్భుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
గ్రహాల అమరిక సర్వసాధారణమా..?
అప్పుడప్పుడు గ్రహాల స్థానాలు సూర్యునికి ఒకే వైపున సమలేఖనం అవుతాయి. దీర్ఘవృత్తాకార కక్ష్యలో గ్రహాల అమరిక ఉండటం వల్ల భూమినుంచి చూసినప్పుడు ఆకాశంలో అవన్నీ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి.దీన్నే ప్లానెటరీ పరేడ్ అని పిలుస్తున్నాం.వాస్తవానికి ఒక్కో గ్రహం మరో గ్రహం నుంచి కొన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నట్లు ఒక భ్రమను సృష్టిస్తుంది.ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు.మూడు నుంచి ఎనిమిది గ్రహాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు ప్లానెట్ అలైన్మెంట్ (గ్రహాల అమరిక) జరుగుతుంది.ఐదు నుంచి ఆరు గ్రహాలు ఒకే వరుసలో రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఏడు గ్రహాలు ఒకేసారి వరుసలో అమరిక జరగడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications