ధోనీకి చీవాట్లు పెట్టిన స్టార్ హీరో- అవి గానీ వింటే?
Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘోర ఓటమిని చవి చూసింది. కోల్కత నైట్ రైడర్స్ చేతిలో అవమానకరంగా పరాజయాన్ని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లల్లో సీఎస్కే.. గెలిచింది ఒక్కటే. చివరి అయిదింట్లోనూ చేతులెత్తేసింది. ఇక ముందు గెలుస్తుందనే అంచనాలు కూడా లేవీ జట్టుపై.
చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను కోల్కత నైట్రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్కు దిగిన కోల్కత అలవోకగా ఈ స్వల్ప స్కోర్ను అధిగమించింది. 10.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఎగబాకింది కేకేఆర్. స్కోరు స్వల్పమే అయినప్పటికీ- కేకేఆర్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు.
క్వింటన్ డికాక్ 16 బంతుల్లోనే 23, సునీల్ నరైన్ 18 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనంతరం రహానే- 20, రింకూ సింగ్- 15 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగలిగారు.

సీఎస్కే పేలవంగా ఆడిందీ మ్యాచ్లో. అటు బ్యాటింగ్లో గానీ ఇటు బౌలింగ్లో గానీ ఏ మాత్రం కూడా స్థాయి తగ్గ ఆటతీరును కనపర్చలేకపోయింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. అనంతరం విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు.
విజయ్ శంకర్ 21 బంతుల్లో 29 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 16 పరుగులు చేశాడు. శివం దూబే ఒంటరి పోరాటం చేశాడు గానీ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించలేకపోయాడు. 29 బంతుల్లో 31 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్. కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో సహా ఆరు మంది బ్యాటర్లు ఆరు పరుగులు మాత్రమే జోడించారు.
I refrained n refrained n refrained being a cricketer myself...
— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 11, 2025
I didn wanna come to conclusions too soon...
But this is atrocious...
Why come so lower down the order ..
Is any sport played not to win?
Its just like visitn a circus now...
NO INDIVIDUAL IS BIGGER THAN THE…
ఈ ఓటమి అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరుపై హీరో విష్ణు విశాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇండైరెక్ట్గా ధోనీపై విరుచుకుపడ్డాడు. ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లను చూసిన తరువాత క్రికెటర్ కావాలనుకునే తన ప్రయత్నాలను మానుకున్నానంటూ తేల్చి చెప్పాడు. ఇలా వరుసబెట్టి మ్యాచ్లను ఓడిపోవడం అత్యంత దారుణమంటూ వ్యాఖ్యానించాడు.
లోయర్ ఆర్డర్లో ధోనీ బ్యాటింగ్కు రావడాన్నితప్పు పట్టాడు విష్ణు విశాల్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం ఎందుకంటూ నిలదీశాడు. ఓడిపోవడామనికి ఎవ్వరైనా మ్యాచ్లు ఆడతారా? అంటూ ఎద్దేవా చేశాడు. ఈ మ్యాచ్- ఓ సర్కస్ను చూసినట్టుగా ఉందని చురకలు అంటించాడు. స్పోర్ట్స్ కంటే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదని చెప్పాడు. ఈ మేరకు మ్యాచ్ ముగిసిన తరువాత ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications