ఏడు బంతులతో.. ఓవర్నైట్ స్టార్: టీమిండియా మాజీకి డెడికేట్
Ashutosh Sharma: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్లో ఎట్టకేలకు ఓ థ్రిల్లర్ చూసే అవకాశం లభించింది తెలుగు నేలపై. ఢిల్లీ కేపిటల్స్పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. ఒకే ఒక్కడి వల్ల.
సోమవారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే ఈ స్కోర్ను అధిగమించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులతో విజయాన్ని అందుకుంది.

ఢిల్లీ ఇన్నింగ్లో అసలు హీరో అశుతోష్ శర్మ. 12.3 ఓవర్లల్లో 113 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి, ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజ్లోకి దిగిన అశుతోష్ వీరవిహారం చేశాడు. గెలవాలంటే- 45 బంతుల్లో 97 పరుగులు అవసరం. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో 66 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు కొట్టాడు. ఆ తరువాతి ఓవర్లోనూ అతని దూకుడు కొనసాగింది. అతని ప్రతాపానికి ప్రిన్స్ యాదవ్ బలి అయ్యాడు. ఆ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు రాబట్టడంతో ఈక్వేషన్లు మొత్తం మారిపోయాయి. అంతరం ఆరు బంతులకు ఆరు పరుగులుగా తేలింది.
చివరి ఓవర్ తొలి రెండు బంతులను మోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఓవర్ అది. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతిని అశుతోష్ శర్మ సిక్సర్గా మలిచాడు. జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అతను ఎదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 34 పరుగులు వచ్చాయంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 6,4,6,2,6,4,6.. పరుగులు రాబట్టుకున్నాడు.
విన్నింగ్ షాట్ కొట్టిన తరువాత- టీమ్ బ్యాటింగ్ కన్సల్టెంట్ కెవిన్ పీటర్సన్కు థ్యాంక్స్ చెప్పాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా అతను మాట్లాడాడు. కెవిన్ ఇచ్చిన టిప్స్ తన బ్యాటింగ్ స్టైల్ను మెరుగుపర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని, దాని ఫలితంగానే ఈ ఇన్నింగ్ ఆడగలిగానని అన్నాడు.
ఈ మెరుపు ఇన్నింగ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ను టీమిండియా మాజీ క్రికెటర్కు శిఖర్ ధావన్కు అంకితం చేశాడు అశుతోష్ రాణా. శిఖర్ను తన మెంటార్గా అభివర్ణించాడు. అతనిచ్చిన స్ఫూర్తితోనే.. ఒత్తిడిని జయించగలిగానని చెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఆడాలని, ఒత్తిడికి దూరంగా ఉండాలనే విషయాన్ని శిఖర్ నుంచే నేర్చుకున్నానని అన్నాడు.
గత సీజన్లో కొన్ని మ్యాచ్లను అసంపూర్తిగా వదిలివేశానని గుర్తు చేసుకున్నాడు. ఈ సీజన్లో ఆ లోటును తీర్చుకుంటానని, అత్యుత్తమ ఫినిషర్గా గుర్తింపు పొందాలని కోరుకుంటోన్నట్లు అశుతోష్ శర్మ వివరించాడు.
-
AAHAR 2026: మార్చి 10 నుంచి ఢిల్లీలో భారీ ఫుడ్ ఎగ్జిబిషన్..!! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications